Shahid Afridi: ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్.. పీసీబీపై విరుచుకుపడ్డ షాహిద్ అఫ్రిది
- ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్
- పీసీబీపై విరుచుకుపడ్డ షాహిద్ అఫ్రిది
- షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. రెండు జట్ల మధ్య 5 T20లు, 3 ODIలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. పీసీబీ తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని అన్నాడు.
Also Read:WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ!
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
గత T20 ప్రపంచ కప్ నుంచి ఆటకు దూరంగా ఉన్న షాదాబ్ను తిరిగి జట్టులోకి తీసుకుని, న్యూజిలాండ్తో జరిగే విదేశీ సిరీస్ కోసం పాకిస్తాన్ T20 జట్టులో సల్మాన్ అలీ అఘా స్థానంలో వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ వ్యవహారంపై ఫైర్ అయిన ఆఫ్రిది.. ఏ ప్రాతిపదికన అతన్ని వెనక్కి పిలిచారు? దేశవాళీ క్రికెట్లో అతని ప్రదర్శన ఎలా ఉంది? అతన్ని మళ్లీ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు అని షాహిద్ అఫ్రిది అన్నారు. అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వరకు పాకిస్తాన్ క్రికెట్లో ఏమీ మారదని ఈ ఆల్ రౌండర్ అన్నారు.
Also Read:Sandeep Reddy : ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్న సందీప్ రెడ్డి.. అలా ఉంటేనే ఓకే
బోర్డు నిర్ణయాలు, విధానాలలో ఏకాభిప్రాయం లేదు. మేము కెప్టెన్లు, కోచ్లు, కొంతమంది ఆటగాళ్లను మారుస్తూనే ఉన్నాము కానీ చివరికి బోర్డు అధికారుల జవాబుదారీతనం ఏమిటి అని మాజీ కెప్టెన్ ప్రశ్నించాడు. తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కోచ్ ఆటగాళ్లను నిందించడం బాధగా ఉందని, తమ సీటును కాపాడుకోవడానికి ఆటగాళ్లను, కోచ్లను యాజమాన్యం నిందించడం బాధగా ఉందని ఆయన అన్నారు. డామోక్లెస్ కత్తి నిరంతరం కెప్టెన్లు, కోచ్ల తలలపై వేలాడుతూ ఉన్నప్పుడు మన క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది?అని అన్నాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని, కానీ నిజం ఏమిటంటే అతనికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదని అఫ్రిది అన్నారు. PCB ఛైర్మన్ గా ఉండటం పూర్తి సమయం ఉద్యోగం కాబట్టి అతను ఒక విషయంపై దృష్టి పెట్టాలి అని అఫ్రిది అన్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..