Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Telangana Seeks 30 Lmt Boiled Rice Procurement Centre Revanth Reddy

Prahlad Joshi: 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సూచన

Published Date :April 17, 2026 , 1:25 pm
By RAMAKRISHNA KENCHE
Prahlad Joshi: 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సూచన
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Prahlad Joshi: యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట‌ బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. గత ఆరు యాసంగి సీజ‌న్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విష‌యం స్పష్టమ‌వుతుంద‌న్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయ‌న నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉద‌యం క‌లిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణ‌లో ఈ యాసంగి సీజ‌న్‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. తెలంగాణ‌లో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివ‌రించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంట‌కు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూక‌తో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూక‌తో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాద‌న‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

READ MORE: UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాస‌లో భారత్ ఖండన

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

2014-15 వ‌ర్షాకాలం పంట అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వ‌రి ధాన్యం ఉత్పత్తి, సేక‌ర‌ణ‌లో తెలంగాణ అగ్రగామిగా ఉంద‌ని, ధాన్యం సేక‌రించిన 48 గంట‌ల్లోనే రైతుల‌కు తాము చెల్లింపులు చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలియ‌జేశారు. రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంట‌నే పాత బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. పిల్లల్లో ర‌క్తహీన‌త‌, పోష‌కాల లోపాల‌ నివార‌ణ‌కు గానూ పోష‌కాహార బియ్యాన్ని (FRK) పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, ఐసీడీఎస్‌ల ప‌రిధిలో పంపిణీ చేసేవార‌ని… ఇటీవ‌ల దానిని నిలిపివేసినందున వెంట‌నే దానిని పునః ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స‌మావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, సెక్రట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • boiled rice demand India
  • Prahlad Joshi meeting
  • revanth reddy delhi visit
  • Telangana boiled rice procurement
  • Telangana Latest Politics

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions