Ponnam Prabhakar: ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ఆయన అన్నారు.
Read Also: Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తెలంగాణా విభజననే తప్పు పట్టిన బీజేపీ ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మా గ్యారంటీల గురించి అడిగే బీజేపీ.. మోడీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని.. నిరుద్యోగుల గురించి ఏం చేశారని.. ప్రశ్నలు గుప్పించారు. మేము ఇద్దరం మాకు ఇద్దరు అన్నట్టు మోడీ, అమిత్ షా.. అదానీ, అంబానీకి దోచి పెట్టారని మంత్రి ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తుందన్నారు. మోడీ బొమ్మ మరిచిపోయారన్నారు. ఇంటింటికి రాముడు ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఏం చేశారో చెప్పకుండా.. రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
మహాత్మా గాంధీ నుండే కాంగ్రెస్ రాముడిని కొలిచిందన్నారు. చేనేతల జీవితాల్లో బీజేపీ చీకటి నింపిందన్నారు. రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారని.. మీ హయాంలో25 రూపాయలు అయినా ఇచ్చావా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ అభ్యర్థిని తాము ఇంకా ప్రకటించనే లేదా.. హరీష్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఎలా అంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!