Ponnam Prabhakar: ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ఆయన అన్నారు.
Read Also: Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
తెలంగాణా విభజననే తప్పు పట్టిన బీజేపీ ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మా గ్యారంటీల గురించి అడిగే బీజేపీ.. మోడీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని.. నిరుద్యోగుల గురించి ఏం చేశారని.. ప్రశ్నలు గుప్పించారు. మేము ఇద్దరం మాకు ఇద్దరు అన్నట్టు మోడీ, అమిత్ షా.. అదానీ, అంబానీకి దోచి పెట్టారని మంత్రి ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తుందన్నారు. మోడీ బొమ్మ మరిచిపోయారన్నారు. ఇంటింటికి రాముడు ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఏం చేశారో చెప్పకుండా.. రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
మహాత్మా గాంధీ నుండే కాంగ్రెస్ రాముడిని కొలిచిందన్నారు. చేనేతల జీవితాల్లో బీజేపీ చీకటి నింపిందన్నారు. రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారని.. మీ హయాంలో25 రూపాయలు అయినా ఇచ్చావా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ అభ్యర్థిని తాము ఇంకా ప్రకటించనే లేదా.. హరీష్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఎలా అంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?