Jagadish Reddy : రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తూ… ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ.. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే.. తెలంగాణాప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుండి రావాల్సిన 12,900 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని ఆయన వెల్లడించారు. విద్యుత్ తోపాటు, బకాయిలు, పీపీఏ లలోను తెలంగాణకు ఏపీ నష్టమే చేసిందని ఆయన తెలిపారు. ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని, గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు, ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణా లోనేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఆందుకే బీజేపీ సర్కార్ కు కంటగింపుగా ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని ఆయన దుయ్యబట్టారు. అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదని, ఏపీ నుండి రావాల్సిన 12,941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని, నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. జాతీయ ప్రభుత్వంగా చేయాల్సింది ఇది కాదని, తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయని, తెలంగాణా లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!