Jagadish Reddy : రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తూ… ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ.. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే.. తెలంగాణాప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుండి రావాల్సిన 12,900 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని ఆయన వెల్లడించారు. విద్యుత్ తోపాటు, బకాయిలు, పీపీఏ లలోను తెలంగాణకు ఏపీ నష్టమే చేసిందని ఆయన తెలిపారు. ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని, గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు, ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణా లోనేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆందుకే బీజేపీ సర్కార్ కు కంటగింపుగా ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని ఆయన దుయ్యబట్టారు. అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదని, ఏపీ నుండి రావాల్సిన 12,941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని, నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. జాతీయ ప్రభుత్వంగా చేయాల్సింది ఇది కాదని, తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయని, తెలంగాణా లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?