Ration Cards: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
- రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి చేసేందుకు ప్రభుత్వం పెద్దపీట
- గ్రామ సభల్లో పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు.
Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణా రావు, మంత్రి దనసరి అనసూయ, ఇతర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలు కీలక విషయాలు చర్చించారు.
Also Read: MEIL: తెలంగాణలో రూ.11 వేల కోట్ల పెట్టుబడులతో మెఘా ఇంజనీరింగ్ కీలక ఒప్పందాలు
Also Read
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. ఈ సభలలో గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబడతాయని, దాదాపు రూ. 40 వేల కోట్ల వ్యయం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ రెండు పథకాలు గతంలో తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తరువాత ఈ పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని.. గ్రామ సభలలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుదారులలో ఇల్లు లేని వారు, ఇల్లు లేకున్నా స్థలం ఉన్నవారిని గుర్తించి జాబితా చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.
Also Read: JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!
రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను త్వరలో విడుదల చేస్తామని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. వీటి కోసం దరఖాస్తుదారుల పేరు, ఆధార్ నంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ వంటి వివరాలను సేకరించాల్సిందిగా తెలిపారు. ముఖ్యంగా గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 4098 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడ్డాయని, అందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
-
Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
-
Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
-
West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!