TSRTC Merger Bill: ఆర్టీసీ విలీనం.. గవర్నర్కు ప్రభుత్వం వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Merger Bill: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య కొత్త వివాదాన్ని సృష్టించింది.. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.. అయితే, అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం.. కానీ, టీఎస్ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని గవర్నర్ పేర్కొన్నారు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని.. ప్రభుత్వం సరైన వివరణ వస్తే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
అయితే, గవర్నర్ అడిగిన ప్రశ్నలకు తాజాగా వివరణ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. టీఎస్ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్కి వివరణ పంపించారు అధికారులు.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని వివరణలో పేర్కొంది ప్రభుత్వం.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత విధివిధానాలలో అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్లో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వివరణ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాగా, ప్రభుత్వం పంపించిన బిల్లును గవర్నర్ ఆపడంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్ పాటించిన విషయం విదితమే కాగా.. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్కు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత దాదాపు 10 మంది ఆర్టీసీ యూనియన్ లీడర్లను లోపలికి అనుమతించారు.. గవర్నర్కు మెమెరాండం ఇవ్వడంతో పాటు.. ఆమెతో ఆర్టీసీ విలీనం బిల్లుపై చర్చించనున్నారు నేతలు.
కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లే పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!