Mallu Ravi : నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీ – గత ప్రభుత్వంపై విమర్శ
- నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీ
- గత ప్రభుత్వంపై మల్లు రవి విమర్శ
- కాంగ్రెస్ హయాంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు : మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ప్రజలను మోసం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం లక్ష్యంగా పాలన కొనసాగుతోంది,” అని పేర్కొన్నారు.
Xiaomi: షావోమి స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన చర్యలలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సుమారు 25 లక్షల మంది రైతులకు రూ. 22,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు మల్లు రవి చెప్పారు. ఇది రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరటగా నిలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పేద విద్యార్థి గుణాత్మక విద్య పొందేలా వీటిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే, 7 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు, 200 శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.
ఎస్సి, ఎస్టి, మైనారిటీ యువతలో 5 లక్షల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ. 6 వేల కోట్లతో పథకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇదే విధంగా, “గిరి సౌర జల వికాస్” పథకానికి రూ. 11,600 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైస్ మిల్లులు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 కోట్ల 5 లక్షల మంది పేదలకు సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతోంది. “తెలంగాణను ఏర్పాటుచేసిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది,” అని మల్లు రవి తెలిపారు. పలు సామాజిక హితం కలిగించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
Fraud : ఉద్యోగాల పేరుతో మోసం.. హైకోర్టు జడ్జిగా నటించిన మహిళ అరెస్టు
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!