Jupally Krishna Rao: కేసీఆర్.. ఏ విషయంలో నాకంటే గొప్పోడివి: జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao Aggressive Comments On CM KCR: ఎన్నికలు రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వేషాలు మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. కేసీఆర్పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని జూపల్లి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరని, ఏ విషయంలో తన కంటే గొప్పోడని జూపల్లి మండిపడ్డారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం చెప్పారంటూ సంచలనానికి తెరదీశారు.
‘అహంకారంలో కేసీఆర్ని మించిన వాళ్లు ఎవరున్నారు?. అహంకార పూరితంగా మాట్లాడుతుంది కేసీఆర్. డబ్బు, అధికారం ఉందనే అహంకారంతోనే కదా ఎమ్మెల్యేలను కొంటున్నావు. నేను బీజేపీ లీడర్ని మేనేజ్ చేయాలా?. మాట్లాడటానికి బుద్ది ఉండాలి. అంబేద్కర్కి పూలమాల కూడా వేయంది అహంకారంతోనే కదా?. ఒక్క అమర వీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించనిది అహకరంతోనే. ఎమ్మెల్యే, మంత్రులను కూడా కలవకుండా అహంకారంతో ఉన్నది నువ్వు. నా కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఏ విషయంలో నా కంటే గొప్పోడివి. నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు’ అని జూపల్లి సీఎంపై ఫైర్ అయ్యారు.
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
‘ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ పగటి వేశగాడి లెక్క వేషాలు మారుస్తున్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్. ఢిల్లీకి పోతే దేశ పార్టీ అధ్యక్షుడు అయిన రాహుల్, సోనియాలు కలుస్తారు. మీ లెక్క కాదు వారు. నీ బిడ్డ కవిత మేనేజ్ చేయలేకనే ఒడిపోయిందా?. మరి నువ్వెందుకు ఒడిపోయావు.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది’ అని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
‘కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాణి వాళ్లకు డబ్బులు ఇస్తాం రండి అని మేనేజ్ చేసుకుంటుంది మీరు. మీ లెక్క మేనేజ్మెంట్ చేయలేము మేము. తెలంగాణ తెచ్చుకుంది అందుకునేనా?. దళిత బంధు అందరికి ఇచ్చావా?. బీఆర్ఎస్ నేతలు దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్లలో 2 వేల కోట్లు ఇవ్వలేని వాడు.. 20 రోజుల్లో లక్ష కోట్లు ఎలా తెస్తాడు. ఏ విషయంలో నాతో చర్చకు వస్తారో రండి. కేటీఆర్, హరీష్.. ఎవరిస్తారో రండి. అబిడ్స్ అమరవీరుల స్థూపం దగ్గర చర్చకి వస్తావా?’ అని జూపల్లి సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!