TG DSC : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ లిస్ట్ విడుదల
- డీఎస్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల
- 11వేల డీఎస్సీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ
- మొత్తం 11 వేల 62 పోస్టులకు.. 10 వేల 6 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు
- మిగిలిన వెయ్యి 56 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11,000 డీఎస్సీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మంగళవారం విద్యా శాఖ వివిధ జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లో ఉంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కోర్టు కేసులు , ఇతర కారణాల వల్ల ఇంకా తుది స్థితికి రాలేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.
Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయబడనున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ద్వారా పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం తుది జాబితా పాఠశాల విద్యా కమిషనర్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయబడుతుంది. ఎల్బీ స్టేడియంకు చేరే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు, వీటిలో ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ , సమన్వయ అధికారిని నియమించాలి. జిల్లా బస్సుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి.
9వ తేదీన హైదరాబాద్లో వర్షం వచ్చే అవకాశం ఉండటంతో, రెయిన్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు , వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి రానున్నారు, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడతాయి.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!