TG DSC : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ లిస్ట్ విడుదల
- డీఎస్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల
- 11వేల డీఎస్సీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ
- మొత్తం 11 వేల 62 పోస్టులకు.. 10 వేల 6 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు
- మిగిలిన వెయ్యి 56 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11,000 డీఎస్సీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మంగళవారం విద్యా శాఖ వివిధ జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లో ఉంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కోర్టు కేసులు , ఇతర కారణాల వల్ల ఇంకా తుది స్థితికి రాలేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.
Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయబడనున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ద్వారా పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం తుది జాబితా పాఠశాల విద్యా కమిషనర్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయబడుతుంది. ఎల్బీ స్టేడియంకు చేరే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు, వీటిలో ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ , సమన్వయ అధికారిని నియమించాలి. జిల్లా బస్సుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి.
9వ తేదీన హైదరాబాద్లో వర్షం వచ్చే అవకాశం ఉండటంతో, రెయిన్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు , వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి రానున్నారు, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడతాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!