Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. సంస్కరణలు అమలు చేసే వరకు ఎటువంటి ఎన్నికలు జరగవని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నాయకత్వంలో రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రజలకు సాధికారత కల్పిస్తూనే ప్రాతినిధ్య మరియు సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ సంస్కరణల సిఫార్సులపై నివేదికను సిద్ధం చేస్తుందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
కమిషన్లో విద్యార్థి ప్రతినిధి మహ్ఫుజ్ ఆలం కూడా ఉన్నారు. ఇతను చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడు కూడా అని నివేదిక పేర్కొంది. ఇతర సభ్యుల్లో ఢాకా యూనివర్సిటీ (DU) లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు సుమయ్య ఖైర్, ముహమ్మద్ ఇక్రాముల్ హక్, బారిస్టర్ ఇమ్రాన్ సిద్ధిక్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షరీఫ్ భుయాన్ ఉన్నారు.
ఉద్యోగ కోటాపై బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె భారత్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఆయన రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!