Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. సంస్కరణలు అమలు చేసే వరకు ఎటువంటి ఎన్నికలు జరగవని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నాయకత్వంలో రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రజలకు సాధికారత కల్పిస్తూనే ప్రాతినిధ్య మరియు సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ సంస్కరణల సిఫార్సులపై నివేదికను సిద్ధం చేస్తుందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
కమిషన్లో విద్యార్థి ప్రతినిధి మహ్ఫుజ్ ఆలం కూడా ఉన్నారు. ఇతను చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడు కూడా అని నివేదిక పేర్కొంది. ఇతర సభ్యుల్లో ఢాకా యూనివర్సిటీ (DU) లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు సుమయ్య ఖైర్, ముహమ్మద్ ఇక్రాముల్ హక్, బారిస్టర్ ఇమ్రాన్ సిద్ధిక్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షరీఫ్ భుయాన్ ఉన్నారు.
ఉద్యోగ కోటాపై బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె భారత్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఆయన రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!