Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. సంస్కరణలు అమలు చేసే వరకు ఎటువంటి ఎన్నికలు జరగవని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నాయకత్వంలో రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రజలకు సాధికారత కల్పిస్తూనే ప్రాతినిధ్య మరియు సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ సంస్కరణల సిఫార్సులపై నివేదికను సిద్ధం చేస్తుందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
కమిషన్లో విద్యార్థి ప్రతినిధి మహ్ఫుజ్ ఆలం కూడా ఉన్నారు. ఇతను చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడు కూడా అని నివేదిక పేర్కొంది. ఇతర సభ్యుల్లో ఢాకా యూనివర్సిటీ (DU) లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు సుమయ్య ఖైర్, ముహమ్మద్ ఇక్రాముల్ హక్, బారిస్టర్ ఇమ్రాన్ సిద్ధిక్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షరీఫ్ భుయాన్ ఉన్నారు.
ఉద్యోగ కోటాపై బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె భారత్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఆయన రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!