Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. సంస్కరణలు అమలు చేసే వరకు ఎటువంటి ఎన్నికలు జరగవని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నాయకత్వంలో రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రజలకు సాధికారత కల్పిస్తూనే ప్రాతినిధ్య మరియు సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ సంస్కరణల సిఫార్సులపై నివేదికను సిద్ధం చేస్తుందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
కమిషన్లో విద్యార్థి ప్రతినిధి మహ్ఫుజ్ ఆలం కూడా ఉన్నారు. ఇతను చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడు కూడా అని నివేదిక పేర్కొంది. ఇతర సభ్యుల్లో ఢాకా యూనివర్సిటీ (DU) లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు సుమయ్య ఖైర్, ముహమ్మద్ ఇక్రాముల్ హక్, బారిస్టర్ ఇమ్రాన్ సిద్ధిక్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షరీఫ్ భుయాన్ ఉన్నారు.
ఉద్యోగ కోటాపై బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె భారత్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఆయన రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!