Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. సంస్కరణలు అమలు చేసే వరకు ఎటువంటి ఎన్నికలు జరగవని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ ప్రొఫెసర్ అలీ రియాజ్ నాయకత్వంలో రాజ్యాంగ సంస్కరణల సంఘం తన నివేదికను 90 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రజలకు సాధికారత కల్పిస్తూనే ప్రాతినిధ్య మరియు సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ సంస్కరణల సిఫార్సులపై నివేదికను సిద్ధం చేస్తుందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
కమిషన్లో విద్యార్థి ప్రతినిధి మహ్ఫుజ్ ఆలం కూడా ఉన్నారు. ఇతను చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడు కూడా అని నివేదిక పేర్కొంది. ఇతర సభ్యుల్లో ఢాకా యూనివర్సిటీ (DU) లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు సుమయ్య ఖైర్, ముహమ్మద్ ఇక్రాముల్ హక్, బారిస్టర్ ఇమ్రాన్ సిద్ధిక్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ షరీఫ్ భుయాన్ ఉన్నారు.
ఉద్యోగ కోటాపై బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె భారత్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీంతో ఆయన రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి.. హర్యానాలో బీజేపీ విజయంపై మోడీ
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!