Telangana Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్భవన్కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాల్లో మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also: Director K Viswanath Is No More Live: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. ఆదివారం ఉదయం 10.30గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్లో మార్గదర్శనం చేస్తారు.
Read Also:Telangana Cabinet Meeting: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్.. బడ్జెట్ ఆమోదం..
ఎన్నికల సంవత్సరం కావడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. విపక్షాలను ఎదు ర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రాష్టాన్ని ఆర్థికంగా దిగ్బంధిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు గత ఏడాది డిసెంబర్లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే డిసెంబర్లో సమావేశాలు వీలు కాలేదు. దీంతో ప్రస్తుత సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని, కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి రిక్తహస్తం చూపడంపై ఇప్పటికే మంత్రి హరీశ్ సహా బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జె ట్పై చర్చకు సమాధానం, ఇతర పద్దులపై చర్చ సందర్భంగా కేంద్ర విధానాలను కేసీఆర్ ఎండగడతారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!