UPSC: సివిల్స్లో మెరిసిన తెలుగు తేజం.. కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం సివిల్స్ ఫలితాలు విడుదల కాగానే తెలుగు తేజం అనన్య రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశమంతా ఆమె పేరు అందరినోళ్లలో వినిపిస్తోంది. దీనికి ఆమె సాధించిన ర్యాంకే. చూడ్డానికి మనిషి బక్కపలచగా.. సన్నగా ఉంది. కానీ ఆమె సాధించిన ర్యాంక్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. పైగా ఆమె తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభ చూపించారు. దేశంలోనే మూడో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల్లో అయితే ఆమెనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైస్కూల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించడం మరో గొప్ప విశేషం.

Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
సివిల్స్ పరీక్ష అంటేనే ఎంతో కఠినం. అలాంటిది ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం మామూలు విషయమా? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలబడడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంత ప్రిపరేషన్తో సివిల్స్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి అందరి చేత ప్రశంసలు పొందుతోంది.
తాను రెండేళ్లుగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు అనన్య రెడ్డి తెలిపారు. తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేస్తూ ప్రయాణం సాగిస్తానని తెలిపారు. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్ను ఎంచుకున్నట్లు తెలిపారు.
ఇక ఆదిత్య శ్రీవాస్తవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. అనిమేష్ ప్రధాన్ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్ రామ్కుమార్ (4), రుహాని (5), సృష్టి దబాస్ (6), అన్మోల్ రాఠోర్ (7), ఆశీష్ కుమార్ (8), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్ – 2022 ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం.
#WATCH | Ananya Reddy says, "…I had been preparing for UPSC for two full years. This is my first attempt. I feel extremely happy and grateful that I have been able to achieve this rank in my first attempt…I want to do service to the people. That spirit of public service that… https://t.co/9KBrqGS7IO pic.twitter.com/dFmxuw4vzS
— ANI (@ANI) April 16, 2024
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!