Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్గా భారత మాజీ మహిళా క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nooshin Al Khadeer Named Interim Head Coach for India Women’s Team: దాదాపుగా 5 నెలల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 9 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్లు అన్ని మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం తాజాగా 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజాగా హెడ్ కోచ్గా భారత మాజీ మహిళా క్రికెటర్ను ఎంపిక చేసింది.
2022 డిసెంబర్లో మహిళల జట్టు హెడ్ కోచ్ రమేశ్ పొవార్ని బీసీసీఐ బదిలి చేసింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి అతడిని పంపించేసింది. దీంతో అప్పటి నుంచి కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతోంది. 2023 ఏప్రిల్లో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే, దేశవాళీ దిగ్గజం అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Also Read: Nabha Natesh Latest Pics: నభా నటేష్ అందాల విందు.. ‘ఇస్మార్ట్’ పోరి గ్లామర్కు కుర్రాళ్లు ఫిదా!
రెండేండ్ల కాలానికి అమోల్ ముజుందార్ హెడ్ కోచ్గా రానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కమిటీ కూడా అతడిని ఫైనల్ చేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ను తాత్కాలిక హెడ్ కోచ్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.
బంగ్లాదేశ్ పర్యటనకు ముందే నూషిన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే ఆమెకు తొలి పరీక్ష కానుంది. బంగ్లాదేశ్ టూర్ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఆ తర్వాత పలు ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అప్పటివరకు నూషిన్ ఉంటుందో లేదో చూడాలి.
Also Read: Praveen Kumar Car Accident: ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ భారత మాజీ ప్లేయర్!
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?