T20 World Cup: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు (12) బ్రేక్ పడింది. దీంతో భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అయితే, సూర్య సేన ఆట తీరు మారకుంటే మాత్రం సెమీ ఫైనల్ పోరులో ముందుకు వెళ్లడం చాలా కష్టం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్ కి చేరాలంటే తర్వాత రెండు మ్యాచులలో తప్పక గెలవాల్సిందే.
Read Also: Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
అయితే, భారత్ పై గెలుపుతో దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. భారీ రన్స్ తేడాతో పరాజయం పాలవడంతో టీమిండియా నెట్ రన్రేట్ -3.800గా ఉంది.
సూపర్- 8లో భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్తో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచి తీరాల్సిందే. అప్పుడు భారత్ ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి. అలాగే, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో 4 పాయింట్లు లేకపోతే చాలు భారత్ ఈజీగా సెమీస్కు వెళ్తుంది.
Read Also: Naresh-Pavitra: ఆమె వచ్చాకే నాన్న అలా మారాడు.. నరేష్ పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
ఇక, మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకవేళ భారత్ ఒక దాంట్లో విజయం సాధిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. దీంతో సౌతాఫ్రికా మిగిలిన తన రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. వెస్టిండీస్ – జింబాబ్వేకు మధ్య జరగబోయే మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టును టీమిండియా ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో తలో రెండు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇక, ఈ మూడింట్లో నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న టీమ్ సెమీస్కు వెళ్తుంది.. కాబట్టి భారత జట్టుకి నెట్ రన్రేటే కీలకంగా మారింది. కావునా, ఇప్పటికైనా టీమిండియా ఆటగాళ్లు తమ ఆటిట్యూడ్ ని వదిలి పెట్టి.. మరింత శ్రద్ధగా ఆడాలని క్రికెట్ నిపుణులు సూచిస్తు్న్నారు.