TDP Parliamentary Party Meeting: నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఇలా చేద్దాం..!
- ఇవాళ టీడీపీపీ సమావేశం..
- ఉండవల్లిలోని తన నివాసంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబు భేటీ..
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ..
- రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు.. పెండింగ్ నిధుల ప్రస్తావనపై సమాలోచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Parliamentary Party Meeting: ఇవాళ టీడీపీపీ సమావేశం జరగనుంది.. ఉండవల్లిలోని తన నివాసంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల ప్రస్తావన పార్లమెంట్లో తేవాలని తమ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు జరిపిన ఢిల్లీ పర్యటనల్లో ఇచ్చిన వినతులపై ఫాలో అప్ చేసేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీడీపీపీ. ఢిల్లీలో ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దపడుతోన్నందున్న.. కౌంటర్లను సిద్ధం చేసుకునే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. జగన్ హయాంలో జరిగిన అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది..
Read Also:Pakistan: బిన్ లాడెన్ సన్నిహితుడు అల్ఖైదా ఉగ్రవాది అమీనుల్ హఖ్ అరెస్టు
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఎంపీలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు… ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై కీలక సూచనలు చేయనున్నారు.. ఇక, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిపై కూడా కీలక సూచనలు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!