Kanna Laxminarayana: ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, స్వేచ్ఛగా బ్రతకాలన్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి..!
Kanna Laxminarayana: రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలన్నా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి పదవితో రాష్ట్రాన్ని ఎలా దొచుకోవచ్చు అని వైఎస్ జగన్ నిరూపించారు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి 45 వేల కోట్లు దోచుకున్నాడు.. పదహారు నెలలు జైల్లో ఉండి రాష్ట్రాన్ని ఎలా దొచేయాలి అనే ప్లాన్ వేశాడు.. అధికారం అడ్డుపెట్టుకుని ల్యాండ్, సాండ్ మైన్, వైన్ ల పేరు తో మూడున్నర లక్షల కోట్లు దోచేశారు అని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Tula Uma: బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా.. తుల ఉమ సీరియస్ వార్నింగ్..
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఇక, ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెబుతూ త్వరలో పుస్తకం విడుదల చేస్తాం అని ప్రకటించారు కన్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , అమరావతిని నిర్వీర్యం చేశారు, పెండింగ్ ప్రాజెక్ట్స్ అటకెక్కించారు.. ఉద్యోగులను మోసం చేశారు.. రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టాడు, మళ్ళీ అధికారం ఇస్తే ఏ బ్రిటిష్ వాళ్లకు తకట్టు పెడతాడో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నాసిరకం సారాయికి కేంద్రంగా చేశారు.. నకిలీ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని తెలిపారు. నవరత్నాల పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చి పన్నులు రూపంలో ప్రజలను దోచేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు లక్షా పద్నాలుగు వేల కోట్లు అక్రమ మార్గంలో వాడుకున్నారు.. అందుకే రాష్ట్ర ప్రజలు జగన్ ను వద్దనుకుంటున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!