TDP-Janasena: బీజేపీ పిలుపు కోసం.. టీడీపీ-జనసేన ఎదురుచూపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. అయితే సెకండ్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కారణం బీజేపీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేలేదు. బీజేపీ పిలుపు కోసం టీడీపీ-జనసేన పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
సెకండ్ లిస్టు విడుదలపై అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. మరో వారం రోజుల్లో రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ పిలుపు కోసం రెండు పార్టీల ఎదురుచూస్తున్నాయి. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలకు బీజేపీ వ్యవహరం తలనొప్పిగా మారింది. ఇంతకు కూటమితో పొత్తు బీజేపీ ఇష్టం ఉందా? లేదా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తోందా? అని పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
మొత్తం 118 సీట్లతో టీడీపీ-జనసేన తొలి జాబితా ఇటీవల రిలీజైంది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. 5 సీట్లలో అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అలాగే జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. బీజేపీ కూడా కలిసొస్తే.. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక రెండో విడతలో టీడీపీ 25-30 స్థానాలు, జనసేన 10-12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రెండో విడతలోనూ బీసీ, వైశ్య, మైనార్టీ ఈక్వేషన్లపై చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!