TDP: టీడీపీలో బుజ్జగింపుల పర్వం..! వారికి నో టికెట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్లో బుజ్జగింపుల పర్వానికి అన్ని పార్టీలు తెరలేపాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు.. నేతల్లో కొంత అసంతృప్తిగా కారణం కాగా.. సీట్లు ప్రకటించకముందే.. టీడీపీ.. తమ పార్టీ నేతలను బుజ్జగింపులు, లాలింపులు చేస్తోంది.. ఇప్పటికే జనసేనతో కలిసి వెళ్లాలని నిర్ణయానికి రాగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. దీంతో.. కీలక స్థానాల్లోనూ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.. సుమారు 50-60 సెగ్మెంట్లల్లో నేతలకు టిక్కెట్ల అంశమై సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోందట..ముఖ్యంగా 25-30 స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టిక్కెట్ అని చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. జనసేన, బీజేపీలకు 25-30 స్థానాలను కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చేస్తోన్నారు టీడీపీ ముఖ్యులు.
Read Also: Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కుప్పకూలిన పాండల్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇక, టిక్కెట్ డైలమాలో ఉన్న కీలక నేతల విషయానికి వస్తే.. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, వర్మ, దేవినేని ఉమ, బుచ్చయ్య చౌదరి.. కొనకళ్ల, మండలి బుద్ద ప్రసాద్, ముద్రబోయిన, బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్, జవహర్, చాంద్ బాష ఇలా చాలా మందే ఉన్నారట.. వీరితో పాటు పీతల సుజాత, మాగంటి బాబు, ఆనం, సోమిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజా, కోడెల శివరాం, కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. రెండు టిక్కెట్ల కోసం పట్టు బడుతున్న కీలక కుటుంబాలకు కూడా క్లారిటీ ఇస్తోందట టీడీపీ అధిష్టానం.. ఒకే టిక్కెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారట సీనియర్ నేత అశోక్ గజపతి రాజు. మరోవైపు.. తమకు పూర్తి క్లారిటీ ఉందని.. తామే పోటీ చేస్తామంటున్నారు గోరంట్ల, బండారు, సోమిరెడ్డి.. తాజా ప్రచారాలతో అలకపాన్పు ఎక్కారట ఆనం..? అయ్యన్నను ఎలా డీల్ చేయాలోనని హైకమాండ్ తర్జన భర్జన పడుతోందట.. కీలక నేతలు దృష్టి సారించడంతో.. కొన్ని స్థానాలపై ఏటూ తేల్చుకోలోకపోతోందట టీడీపీ. ఇక, లోక్ సభ స్థానాల నుంచి పోటీకి కాల్వ, పార్దసారథి నేతలు నిరాకరించడం కూడా టీడీపీ తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!