Chandrababu: మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ, జేడీఎస్, ఎన్సీపీ, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా మారిపోయిందన్నారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరం.. మోడీ సేవలు దేశానికి చాలా అవవసరం అన్నారు. భారత్కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకాడంటూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశాఖగా ఎదిగింది.. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే రెండో లేదా మూడో ఆర్థిక శక్తిగా మారబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు చంద్రబాబు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందన్నారు చంద్రబాబు.. ఇక, ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రజలకు ఎంతో సేవ చేశారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో విజన్తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మేం నరేంద్ర మోడీని ప్రతిపాదిస్తున్నాం అని ప్రకటించారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 95 శాతం సీట్లు గెలిచామని వెల్లడించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పనిచేసి ఈ విజయం సాధించాయన్నారు.. నా జీవితంలో ఇలాంటి ఫలితాలను చూడలేదని పేర్కొన్నారు.. ఎన్నికల్లో విజయం వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర అమోగం అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అంతా పనిచేశామని పేర్కొన్నారు. ఇక, ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!