TATA: మొబైల్స్ తయారు చేయనున్న టాటా కంపెనీ!
- పెద్ద చైనీస్ కంపెనీని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు
- విదేశీ సాంకేతికత స్వదేశీ శైలిలో ప్రదర్శించేందుకు టాటా ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్వర్క్లు, హ్యాండ్సెట్లను తయారు చేసేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ వ్యాపారం వైపు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ పెద్ద చైనా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. డీల్ ఖరారైతే.. ఈ చైనా కంపెనీలో టాటాకు 51 శాతం వాటా ఉంటుంది. అంటే దాని నియంత్రణ స్థానిక కంపెనీకి వస్తుంది.
READ MORE: Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
వాస్తవానికి.. భారత ప్రభుత్వం అన్ని చైనా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన ప్రధాన వాటాను భారతీయ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి టాటా గ్రూప్తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వివో భారతీయ కంపెనీతో కలిసి తయారీ, పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, వివో కంపెనీ వాల్యుయేషన్పై ఈ విషయం ఆధారపడి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా తన వైపు నుంచి కంపెనీ విలువను అందించింది. అయితే Vivo దానిని మరింత పెంచాలని భావిస్తోంది. టాటా గ్రూప్ ఖచ్చితంగా ఈ డీల్ గురించి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఏదీ ఖరారు కాలేదు.
ప్రస్తుతం నోయిడాలోని టెక్జోన్ IT పార్క్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉంది. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాలోని 170 ఎకరాల్లో నిర్మించిన కొత్త యూనిట్కు బదిలీ చేయబడుతుంది.Vivo 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. రూ.29,874.90 కోట్ల ఆదాయం వచ్చిందని.. అలాగే రూ.211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.123 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం, Vivo దేశంలోని ప్రతి రాష్ట్రంలో భారతీయ పంపిణీదారులను నియమించడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..