TATA: మొబైల్స్ తయారు చేయనున్న టాటా కంపెనీ!
- పెద్ద చైనీస్ కంపెనీని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు
- విదేశీ సాంకేతికత స్వదేశీ శైలిలో ప్రదర్శించేందుకు టాటా ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్వర్క్లు, హ్యాండ్సెట్లను తయారు చేసేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ వ్యాపారం వైపు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ పెద్ద చైనా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. డీల్ ఖరారైతే.. ఈ చైనా కంపెనీలో టాటాకు 51 శాతం వాటా ఉంటుంది. అంటే దాని నియంత్రణ స్థానిక కంపెనీకి వస్తుంది.
READ MORE: Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
వాస్తవానికి.. భారత ప్రభుత్వం అన్ని చైనా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన ప్రధాన వాటాను భారతీయ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి టాటా గ్రూప్తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వివో భారతీయ కంపెనీతో కలిసి తయారీ, పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, వివో కంపెనీ వాల్యుయేషన్పై ఈ విషయం ఆధారపడి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా తన వైపు నుంచి కంపెనీ విలువను అందించింది. అయితే Vivo దానిని మరింత పెంచాలని భావిస్తోంది. టాటా గ్రూప్ ఖచ్చితంగా ఈ డీల్ గురించి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఏదీ ఖరారు కాలేదు.
ప్రస్తుతం నోయిడాలోని టెక్జోన్ IT పార్క్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉంది. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాలోని 170 ఎకరాల్లో నిర్మించిన కొత్త యూనిట్కు బదిలీ చేయబడుతుంది.Vivo 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. రూ.29,874.90 కోట్ల ఆదాయం వచ్చిందని.. అలాగే రూ.211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.123 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం, Vivo దేశంలోని ప్రతి రాష్ట్రంలో భారతీయ పంపిణీదారులను నియమించడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!