TATA: మొబైల్స్ తయారు చేయనున్న టాటా కంపెనీ!
- పెద్ద చైనీస్ కంపెనీని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు
- విదేశీ సాంకేతికత స్వదేశీ శైలిలో ప్రదర్శించేందుకు టాటా ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్వర్క్లు, హ్యాండ్సెట్లను తయారు చేసేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ వ్యాపారం వైపు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ పెద్ద చైనా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. డీల్ ఖరారైతే.. ఈ చైనా కంపెనీలో టాటాకు 51 శాతం వాటా ఉంటుంది. అంటే దాని నియంత్రణ స్థానిక కంపెనీకి వస్తుంది.
READ MORE: Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
వాస్తవానికి.. భారత ప్రభుత్వం అన్ని చైనా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన ప్రధాన వాటాను భారతీయ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి టాటా గ్రూప్తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వివో భారతీయ కంపెనీతో కలిసి తయారీ, పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, వివో కంపెనీ వాల్యుయేషన్పై ఈ విషయం ఆధారపడి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా తన వైపు నుంచి కంపెనీ విలువను అందించింది. అయితే Vivo దానిని మరింత పెంచాలని భావిస్తోంది. టాటా గ్రూప్ ఖచ్చితంగా ఈ డీల్ గురించి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఏదీ ఖరారు కాలేదు.
ప్రస్తుతం నోయిడాలోని టెక్జోన్ IT పార్క్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉంది. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాలోని 170 ఎకరాల్లో నిర్మించిన కొత్త యూనిట్కు బదిలీ చేయబడుతుంది.Vivo 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. రూ.29,874.90 కోట్ల ఆదాయం వచ్చిందని.. అలాగే రూ.211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.123 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం, Vivo దేశంలోని ప్రతి రాష్ట్రంలో భారతీయ పంపిణీదారులను నియమించడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..