Tarun Chugh: యుద్ద గుర్రాలుగా మారండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్దంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. ఇప్పుడు పెండ్లి ఊరేగింపు గుర్రాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వివిధ మోర్చాల నాయకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది కష్టపడి పనిచేస్తున్నారని… మిగిలిన వాళ్లు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి తరుణ్ చుగ్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, డాక్టర్ పద్మ, వేముల అశోక్, ఆకుల విజయ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, యువ, కిసాన్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు, నాయకలు పాల్గొన్నారు.
Also Read : Venkat Prabhu: నాగ చైతన్య డైరెక్టర్ వెంకట్ ప్రభు అరెస్ట్.. ఎందుకంటే ..?
Also Read
ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే నవంబర్ నుండి మే వరకు రివర్స్ ప్లాన్ లో కార్యక్రమాలను రూపొందించుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కోరారు. అందులో భాగంగా 9,10,11 తేదీల్లో వివిధ మోర్చాలు సమావేశం కావాలని చెప్పారు. మండల స్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్లెవరు? అంటీముట్టనట్లుగా ఉన్నవాళ్లెవరనే వివరాలు సేకరించి తమకు అందజేయాలని సూచించారు. ఈనెల 15, 16 తేదీల్లో మళ్లీ మోర్చాలతో సమావేశమవుతామని స్పష్టం చేశారు. ఇకపై కఠినంగా ఉంటాం. ఎవరినీ ఉపేక్షించబోం. మీరు కూడా కార్యక్రమాల అమలు విషయంలో అట్లనే ఉండాలి. అధికారమే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్నికల ఏడాదిలో ఉన్నందున యుద్దం చేసే గుర్రాల్లా మారాలి. పెళ్లిల్లో ఊరేగించే గుర్రాలతో ఇప్పుడవసరం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి’’అని స్పష్టం చేశారు. ఇకపై మోర్చాలు చేసే ప్రతి కార్యక్రమాన్ని సరళ్ యాప్ లో లోడ్ చేయాలని సూచించారు.
Also Read : Palla Rajeshwar Reddy : అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంది
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!