Minister Adimulapu: సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఐటీయూ 13 డిమాండ్లల్లో మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం చెప్పింది. జీతం పెంపు లేదా సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. మరోవైపు.. సమ్మెలో లేని సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతున్నారు.
Minister Botsa: సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారు..
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
మరోవైపు.. సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల జీతం ఉంది.. పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల ఇవ్వాలని కోరామని అన్నారు. బేసిక్ రూ. 20 వేలు ఇవ్వలేకుంటే.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమని కోరామని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో కూడా చేసే పనికి ఇచ్చే జీతానికి తేడా ఉంది.. దాన్ని సరి చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై 105 మున్సిపాల్టీల్లో సమ్మె చేస్తున్నామని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయమని కోరామని ఉమా మహేశ్వరరావు చెప్పారు.
RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..
దళారీ విధానం వల్ల క్లాప్ డ్రైవర్లకు సరైన జీతాలు లభించడం లేదని సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. క్లాప్ డ్రైవర్లకు జీతాల్లో తేడాలు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.. తమకు మాట మాత్రంగా చెబితే సరిపోదని వెల్లడించామన్నారు. తాము మాత్రమే సమ్మెలో ఉన్నామని.. ఇంకొన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా.. ఇంకా సమ్మెకు వెళ్లలేదని తెలిపారు. మేం సమ్మెను కొనసాగిస్తాం.. మేం పెట్టిన 13 డిమాండ్లల్లో మూండింటికి మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉమా మహేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!