Minister Adimulapu: సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఐటీయూ 13 డిమాండ్లల్లో మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం చెప్పింది. జీతం పెంపు లేదా సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. మరోవైపు.. సమ్మెలో లేని సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతున్నారు.
Minister Botsa: సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారు..
Also Read
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
మరోవైపు.. సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల జీతం ఉంది.. పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల ఇవ్వాలని కోరామని అన్నారు. బేసిక్ రూ. 20 వేలు ఇవ్వలేకుంటే.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమని కోరామని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో కూడా చేసే పనికి ఇచ్చే జీతానికి తేడా ఉంది.. దాన్ని సరి చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై 105 మున్సిపాల్టీల్లో సమ్మె చేస్తున్నామని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయమని కోరామని ఉమా మహేశ్వరరావు చెప్పారు.
RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..
దళారీ విధానం వల్ల క్లాప్ డ్రైవర్లకు సరైన జీతాలు లభించడం లేదని సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. క్లాప్ డ్రైవర్లకు జీతాల్లో తేడాలు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.. తమకు మాట మాత్రంగా చెబితే సరిపోదని వెల్లడించామన్నారు. తాము మాత్రమే సమ్మెలో ఉన్నామని.. ఇంకొన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా.. ఇంకా సమ్మెకు వెళ్లలేదని తెలిపారు. మేం సమ్మెను కొనసాగిస్తాం.. మేం పెట్టిన 13 డిమాండ్లల్లో మూండింటికి మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉమా మహేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!