IND vs SA Final: అలా జరిగితే రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్
- కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్
- ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత జట్టు
- గత 8 నెలల్లో భారత్ రెండో ప్రపంచకప్ ఫైనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA Final: భారత క్రికెట్ జట్టు ఎనిమిది నెలల్లో రెండో ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. మరికొన్ని గంటల్లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ గ్రేట్ మ్యాచ్ బార్బడోస్లో జరగనుంది. నవంబర్ 19, 2023న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ ప్రపంచకప్లో ఏ మ్యాచ్లోనూ ఓడిపోకుండానే టీమిండియా ఫైనల్కు చేరుకుంది. ఐసీసీ టైటిల్ కరువు కోసం సుదీర్ఘ నిరీక్షణను ముగించేందుకు ఇప్పుడు జట్టుకు మరో సువర్ణావకాశం లభించింది. అయితే, రాబోయే ఫైనల్లో భారత్ ఓడిపోతే రోహిత్ బార్బడోస్ సముద్రంలోకి దూకుతాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరదాగా అన్నాడు.
Read Also: Monty Panesar: విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్ భారత్దే..
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ఓడిపోతే సముద్రంలో దూకేస్తాడు – సౌరవ్ గంగూలీ
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ముందుండి జట్టును నడిపించాడని, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. అది ఫైనల్లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నానన్నారు. తప్పకుండా భారత్ కప్ గెలుస్తుందనే విశ్వాసాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ వ్యక్తం చేశారు. జట్టు భయపడకుండా ఆడాలని ఆయన చెప్పారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ ఒకరు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ను 5 సార్లు IPL ఛాంపియన్గా నిలిచింది. అయినప్పటికీ, కెప్టెన్గా తన మొదటి ఐసీసీ ట్రోఫీని గెలవడానికి హిట్మ్యాన్ వేచి ఉన్నాడు. వెస్టిండీస్లో హిట్మ్యాన్ తన నిరీక్షణను ముగించి కెప్టెన్సీలో భారత్ను ప్రపంచ ఛాంపియన్గా చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్లో 37 ఏళ్ల రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. రోహిత్ శర్మ 7 మ్యాచ్ల్లో 248 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో రోహిత్ 57 పరుగులతో అద్భుత అర్ధశతకం ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్లో కూడా హిట్ మ్యాన్ 92 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!