Suspected Death Recall: 2022లో జరిగిన ఆ కేసును రీఓపెన్ చేయాలి.. హోంమంత్రి ఆదేశాలు
- గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి అనుమానాస్పద మృతి కేసు
- ఆ కేసును రీఓపెన్ చేయాలని హోంమంత్రి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspected Death Recall: గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత అనుమానాస్పద మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై, ఓ పక్కన బాధితులు మరో పక్కన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తె జననిని 2022లో బండారు ఆనంద్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని, నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పటి సీఐ తమపైనే హత్య కేసు నమోదు చేశారని యువతి తల్లి హోంమంత్రి ఎదుట వాపోయారు. అప్పట్లో జరిగిన అన్యాయాన్ని, వెలికి తీసేందుకు కేసును రీ కాల్ చేయాలని, హోంమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తమ బిడ్డను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితులపై, హత్యా నేరం మోపడాన్ని సీరియస్గా తీసుకున్నారు హోం మంత్రి అనిత. ఈ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని ఆదేశించారు.
Read Also: Bengaluru: ధోతీ ధరించాడని రైతుని మాల్లోకి అనుమతించని సిబ్బంది.. జీటీ మాల్ ఘటనపై రాజకీయ దుమారం..
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
అసలు జననీ మృతి కేసులో ఏం జరిగింది ?
2022లో జనని, సాతులూరుకు చెందిన ఆటోడ్రైవర్ ఆనంద్లు వివాహం చేసుకున్నారు. జనని, ఆనంద్ ల వివాహం అనంతరం చెన్నైలో కొద్ది రోజులు కాపురం పెట్టారు. నాలుగు నెలల అనంతరం జనని,ఆనంద్లు గుంటూరుకు కాపురం మార్చారు. జనని కుటుంబ సభ్యులతో ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా అత్తింటి వారు చేసినట్లు తెలిసింది. ఇంతలోనే జనని గర్భం దాల్చింది. జననీకి 9 నెలల గర్భం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 14న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు జనని భర్త ఆనంద్ తీసుకెళ్లాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లాడు. సెప్టెంబర్ 17న జనని అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా, జనని మృతిపై అనుమానాలు ఉన్నాయని అదే నెల 28న జిల్లా కలెక్టర్ను కలిసి యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో తల్లిదండ్రుల ఆవేదన విన్న హోంమంత్రి అనిత కేసును రీకాల్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!