IPL 2025: రిషబ్ పంత్ వచ్చే సీజన్ ఆడేది ఆ జట్టుకే..!
- ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ను విడుదల
- గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన
- ఢిల్లీలో పంత్.. ధోనీలను కలిశానని రైనా వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే… కాగా.. గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన ఇచ్చారు. ఈ క్రమంలో.. తాను వేలానికి వెళితే ఎంత మొత్తం వస్తుందని అభిమానులను అడిగాడు పంత్. ఈ క్రమంలో.. రానున్న వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దగా వేలం వేయబోయే ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ కచ్చితంగా ఉంటాడనడంలో సందేహం లేదు. కాగా.. పంత్ తర్వాత ఏ జట్టులో ఆడుతాడో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పాడు. వచ్చే సీజన్లో పంత్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడే అవకాశం ఉందని అన్నాడు.
Read Also: US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
Also Read
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
తాను ఇటీవల చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిశానని, రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడని సురేశ్ రైనా తెలిపాడు. జియో సినిమాతో ఆయన మాట్లాడుతూ.. “నేను ఎంఎస్ ధోనీని ఢిల్లీలో కలిశాను, పంత్ కూడా అక్కడే ఉన్నాడు. ఏదో పెద్ద విషయం జరగబోతోందని నాకు అనిపిస్తుంది. త్వరలో ఎవరో పసుపు జెర్సీని ధరించబోతున్నారు.” అని రైనా అన్నాడు.
Read Also: Pappu Yadav: ఎవరు చంపాలనుకుంటున్నారో.. వచ్చి నన్ను చంపేయండి
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తొమ్మిదేళ్ల పాటు ఢిల్లీకి ఆడాడు. తాజాగా.. జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. పంత్.. తన జట్టు కోసం 111 మ్యాచ్లు ఆడాడు. 35.31 సగటుతో.. 148.93 స్ట్రైక్ రేట్తో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు: అక్షర్ పటేల్ (రూ. 16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు).
తాజావార్తలు
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
-
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
-
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!