Srisailam: శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులపై సుప్రీంకోర్టు తీర్పు..
- శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు
- షాపులు కేటాయించ వద్దని గతంలో 425 జీవో
- ఈ జీవోపై ఇప్పటి వరకు రెండు సార్లు స్టే విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది. దాంతో పలువురు దుకాణదారులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
READ MORE: Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం వాటిని ఉపసంహరించుకున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై స్థానిక అధికారులకు అయోమయం లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జన్ భూయల్ ధర్మసనం.. జీవో 425 అమలు చేయొద్దని మరోసారి స్పష్టంగా వెల్లడించింది.
READ MORE: CM Chandrababu: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..
శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ వెంటనే అన్యమతస్తుల షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక్కడి దుకాణాల వేలం పాటలో ఇతర మతస్థులు పాల్గొననవద్దని బీజేపీతో సహా ఇతర పార్టీలు వేలంను అడ్డుకున్నాయి. దీంతో అప్పుడు వేలం పాటను నిలిపివేశారు. అయితే వివాదం రాజుకున్న తరువాత ఆలయ ఈవోను బదిలీ చేశారు. అనంతరం అన్య మతస్థులకు దుఖానాలు షాపులు కేటాయించ వద్దని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ జీవోపై సుప్రీంకోర్టు రెండు సార్లు స్టే విధించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!