RBI: మీ దగ్గర పాత రూ.500, 1000 నోట్లు ఉన్నాయా.. మార్చుకునే అవకాశం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: మోదీ సర్కారు దేశంలో అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతో 2016లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రభుత్వం అప్పుడు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే ఆ సమయంలో చాలా మంది నోట్లను మార్చుకున్నప్పటికీ.. కొంత మంది వద్ద మాత్రం అవి మిగిలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. పాత నోట్లను మార్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల పిటీషన్లపై శుక్రవారం విచారణ జరిగిపిన ధర్మాసనం ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ నోట్లను మార్చుకోలేక పోయిన వారికి పరిష్కారం చూపగలరా అంటూ అత్యున్నత న్యాయ స్థానం రిజర్వు బ్యాంకును కోరింది. సరైన కారణాలతో, నిజాయితీగా అప్పట్లో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని చూపాలని సూచించింది.
Read Also: Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్తో డేటింగ్
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అలాంటి వారికోసం ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇటీవల కోమాలో ఉన్న ఒక మహిళ తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోలేక పోయిన విషయం ఈ క్రమంలో చర్చించబడింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిస్తూ.. నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే ఆర్బీఐ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా తమవద్ద పాత నోట్లు ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని ధర్మాసనం వెల్లడించింది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలోపు రద్దైన నోట్లను జమచేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
- Tags
- modi
- old notes
- RBI
- Supreme Court
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!