RBI: మీ దగ్గర పాత రూ.500, 1000 నోట్లు ఉన్నాయా.. మార్చుకునే అవకాశం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: మోదీ సర్కారు దేశంలో అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతో 2016లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రభుత్వం అప్పుడు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే ఆ సమయంలో చాలా మంది నోట్లను మార్చుకున్నప్పటికీ.. కొంత మంది వద్ద మాత్రం అవి మిగిలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. పాత నోట్లను మార్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల పిటీషన్లపై శుక్రవారం విచారణ జరిగిపిన ధర్మాసనం ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ నోట్లను మార్చుకోలేక పోయిన వారికి పరిష్కారం చూపగలరా అంటూ అత్యున్నత న్యాయ స్థానం రిజర్వు బ్యాంకును కోరింది. సరైన కారణాలతో, నిజాయితీగా అప్పట్లో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని చూపాలని సూచించింది.
Read Also: Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్తో డేటింగ్
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
అలాంటి వారికోసం ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇటీవల కోమాలో ఉన్న ఒక మహిళ తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోలేక పోయిన విషయం ఈ క్రమంలో చర్చించబడింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిస్తూ.. నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే ఆర్బీఐ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా తమవద్ద పాత నోట్లు ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని ధర్మాసనం వెల్లడించింది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలోపు రద్దైన నోట్లను జమచేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
- Tags
- modi
- old notes
- RBI
- Supreme Court
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!