Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్తో డేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్య అనంతరం విచారణలో అఫ్తాబ్ పూనావాల్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టిన వెంటనే ఓ మహిళను తన ఫ్లాట్కు పిలిచి ఆమెతో అఫ్తాబ్ డేటింగ్ చేశాడు. ఆ మహిళ ఎవరనేది పోలీసులు కూపీ లాగడంతో ఆమె ఒక మానసిక వైద్యురాలిగా పోలీసులు గుర్తించారు. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ ‘బంబ్లే’ ద్వారా ఆ మహిళను అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఇదే బంబ్లే నుంచి రెండేళ్ల క్రితం శ్రద్ధను అఫ్తాబ్ కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధ హత్యకూ, ఈమెకీ సంబంధమేమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Cyber Crime: నరేశ్ చేతిలో దారుణంగా మోసపోయిన జీవిత రాజశేఖర్
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
అంతేకాదు, డేటింగ్ యాప్ ద్వారా మరికొందరు మహిళలను కూడా అఫ్తాబ్ కలిసినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో నిందితుడు అఫ్తాబ్కు పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో-అనాలిసిస్ పరీక్షలను నిర్వహించారు. పోలోగ్రాఫ్ పరీక్షకు సంబంధించి అన్ని సెషన్లు పూర్తయ్యాయని, ప్రీ, మెయిన్, పోస్ట్ అనే మూడు స్టేజ్లు ఈ పరీక్షలో ఉంటాయని ఎఫ్ఎస్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు ఈ పరీక్షలను విశ్లేషించి రిపోర్ట్ రూపొందిస్తారని చెప్పారు. నివేదికపై నిపుణులు సంతృప్తి చెందనట్లయితే మరోసారి అఫ్తాబ్ను పిలిపిస్తామన్నారు. నివేదిక ఆధారంగా నార్కో అనాలసిస్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, అంబేద్కర్ ఆసుపత్రిలో అఫ్తాబ్కు సోమవారంనాడు నార్కో టెస్ట్ జరుపనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి పుర్రె, మిగిలిన శరీర భాగాలతో పాటు మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన మరో ఆయుధాన్ని పోలీసులు ఇంకా కనుక్కోలేదు. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు ఐదు కత్తులను వినియోగించినట్టు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, ఓ ఆయుధం ఇంకా లభ్యం కాలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!