Patnam Suneetha Mahender Reddy: మల్కాజిగిరిని అభివృద్ధి పరిచి, ప్రజల మన్నన పొందాలని దేవున్ని కోరుకున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచార జోరును పెంచారు. ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. అవ్వా తాత, అన్న చెల్లి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో బిజీ బిజీగా సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా.. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఏవీ ఇన్ఫోప్రైడ్ లోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏవీ ఇన్ఫోప్రైడ్ లోగ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారితో నిర్వహించిన సమావేశంలోనూ సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Harish Rao: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మెడలు వంచుతాం
Also Read
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ఇదిలా ఉంటే.. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పూజ కార్యక్రమాలలో పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ హనుమంతుడి దీవెనలు తన పై ఎల్లప్పుడూ ఉండాలని, వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొందాలని.. మల్కాజ్గిరిని అభివృద్ధి పరిచి, ప్రజల మన్నన పొందాలి అని హనుమంతుడిని కోరుకున్నట్లు సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. మల్కాజిగిరి పార్లమెంట్ను శక్తిమంతంగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!