Rajasthan: ఇక్కడ ప్రసాదం దొంగిలిస్తే రోగాలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinath Ji Temple: సాధారణంగా మనం గుడిలో అయినా, ఇంట్లో అయినా దేవునికి పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పిస్తాం. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇక గుడిలో అయితే దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని అర్చకులు ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు. అలా దేవుని ప్రసాదం స్వీకరిస్తే అంత మంచిజరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే రాజస్థాన్ లో మాత్రం దేవునికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని లూటీ చేసి ఆరగిస్తే శుభప్రదంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రాజ్ సమంద్ లో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకున్న మరుసటి రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా శ్రీనాథ్ జీకి, విఠల్ నాథ్ జీకి, లాలన్ కు భక్తులు నైవేద్యాలను సమర్పిస్తారు.
Read also:PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన
Also Read
ఆ నైవేద్యాన్ని రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడి గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఎలా ఆ నైవేద్యాలను తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దీపావళి పండుగను పురస్కరించుకున్న తరువాత.. ఆ మరుసటి రోజు అన్నకూట్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ నేపధ్యంలో గ్రామ వాసులు వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తారని.. ఈ నేపథ్యంలో అక్కడి గిరిజనులు రాత్రి 11 గంటలకు వచ్చి ఆ నైవేద్యాలను దొంలిలిస్తారని.. అలా దొంగిలించిన నైవేద్యాలను తింటే సకల రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం అని.. ఇలా గత 350 సంవత్సరాలుగా జరుగుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!