Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News States Assembly Elections Counting Tomorrow In Telangana Chhattisgarh Madhya Pradesh And Rajasthan

Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

Published Date :December 2, 2023 , 11:40 am
By Chandra Shekhar Pamena
Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపు భాతర దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెలలో జరిగిన తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అయితే, మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి అయిపోతుంది. అయితే, తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తైన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. రేపు ఉదయం 10.30 గంటల కల్లా ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అనే వివరాలు వెల్లడవుతాయి. మరొ నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలు సెమీఫైనల్స్ గా చూస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇక, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ట భద్రత కొనసాగుతుంది.

Read Also: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఓ రేంజ్‌లో బెట్టింగ్‌.. రూ. 2,500 కోట్ల పైమాటే..!?

Also Read

  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

అయితే, నవంబర్ 30వ తేదీ నాడు సాయంత్రం తెలంగాణలో పోలింగ్ పూర్తికాగానే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. ఛత్తీస్ గడ్ లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని పలు సర్వేలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక, మిజోరంలో స్థానిక పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఈ సర్వేల్లో వెల్లడైంది. అయితే, రేపు మిజోరం ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున అక్కడి రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ తేదీని ఎల్లుండికి ఛేంజ్ చేసింది.

Read Also: Parliament Sessions: నేడు అఖిలపక్షం భేటీ.. పార్లమెంట్ లో పలు బిల్లుల ఆమోదానికి కసరత్తు..

ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 46 సీట్లలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.. అలాగే, మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక్కడ 116 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే, రాజస్థాన్ లో 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. ఇక్కడ 101 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. మరో వైపు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగ్గా.. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly Elections Counting
  • Chhattisgarh
  • Madhya Pradesh
  • Rajasthan
  • telangana

తాజావార్తలు

  • Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?

  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..

  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions