Srikakulam: నాలుగు గుళ్లపై అన్యమత సూక్తులు, గుర్తులు.. ఎస్పీ ఏమన్నారంటే?
- శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై రాతలు
- ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
- నాలుగు గుళ్ల పైన అన్యమతస్థులు రాతలు రాశారని వెల్లడి
- టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలు ఏర్పాటు
- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని తెలిపారు. చందక దేవుడు బుడితిలో పాస్టర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9:30 నుంచి 11 మధ్య రెక్కీ నిర్వహించారని.. బైక్స్ పెయింట్ చేయటానికి ఉపయోగించే పెయింట్ తో రాశారని వెల్లడించారు.
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
“అజయ్, ఈశ్వర్ రావు జాన్ పీటర్ అనే పాస్టర్ ప్రోద్బలంతో చేశారు.. యలమంచిలి లో కొత్త చర్చ కట్టేందుకు ప్లాన్ చేశారు.. దాన్ని అడ్డుకునేందుకు ఈ విధంగా చేశారు.. చర్చి కట్టేందుకు ఉన్న ల్యాండ్ దగ్గర క్రాస్ సింబల్ వేశారు.. ముగ్గురు కావాలనే చర్చ నిర్మాణాన్ని ఆపేందుకు ఇలా చేశారు.. మత ఘర్షణలకు ఎవరు ఎంకరేజ్ చేయకూడదు.. అలా చేస్తే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వలన కేసు చేదించడం లేట్ అయింది.. ప్రతి గుడి, చర్చ, మసీదుల దగ్గర ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.” అని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Rahul Gandhi: రాజస్థాన్ పర్యటనలో రాహుల్గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!