Rahul Gandhi: రాజస్థాన్ పర్యటనలో రాహుల్గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!
- రాజస్థాన్లో రాహుల్గాంధీ పర్యటన
- కాంగ్రెస్ కార్యకర్తను పలకరించిన రాహుల్ గాంధీ
- కార్యకర్త సమాధానంతో చిరునవ్వులు చిందించిన ప్రతిపక్ష నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ పర్యటనలో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీకి వింత పరిస్థితి ఎదురైంది. సవాయి మాధోపూర్లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనానికి రాహుల్గాంధీ వెళ్తుండగా సడన్గా కారు ఆపి.. కాంగ్రెస్ కార్యకర్త చుట్టన్ లాల్ మీనాను పలకరించారు. రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని రాహుల్ అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా ‘సచిన్ పైలట్’ కావాలంటూ సమాధానం ఇచ్చాడు. సచిన్ పైలట్కు పగ్గాలు అప్పగిస్తేనే.. రాష్ట్రంలో పార్టీ గాడినపడుతుందని కుండబద్దలు కొట్టినట్లుగా ముఖం మీద చెప్పేశాడు. కార్యకర్త సమాధానంతో రాహుల్గాంధీ చిరునవ్వులు చిందించారు.
ఇది కూడా చదవండి: Delhi: రేపటి నుంచి ఎయిర్పోర్టు టెర్మినల్ 2 మూసివేత.. ప్రయాణికులకు అలర్ట్
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అశోక్ గెహ్లాట్ కూడా మంచివాడే.. ఇప్పటికే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారని.. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదని.. కేవలం ఎమ్మెల్యేలు మాత్రం బాగుపడ్డారని చెప్పుకొచ్చాడు. ఉన్నమాట చెబుతున్నా.. అశోక్ గెహ్లా్ట్ తీరు కారణంగానే రాష్ట్రంలో పార్టీ ఘోరంగా నష్టపోయిందని మీనా చెప్పుకొచ్చాడు. పార్టీ బలోపేతం కావాలంటే.. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని మీనా కోరాడు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు వ్యక్తిగత పర్యటనలో భాగంగా రణతంబోర్లో పర్యటించారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: గర్భిణీ హత్య కేసులో కీలక విషయాలు తెలిపిన స్నేహితులు…
సచిన్ పైలట్ 2018 నుంచి 2020 వరకు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్-సచిన్ మధ్య కుర్చీ వార్ నడిచింది. 2020, జూలై నుంచి రాజస్థాన్ కాంగ్రెస్లో తీవ్ర గందరగోళం నెలకొని.. చివరికి అధికారాన్ని కోల్పోయారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఇది కూడా చదవండి: Nidhi Agerwal : నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన నిధి అగర్వాల్..
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!