WTC Point Table: న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మార్పులు
- న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక
- డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మార్పులు
- పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన శ్రీలంక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో శ్రీలంక, న్యూజిలాండ్ను 154 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక తన గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు 2009లో శ్రీలంక టెస్ట్ సిరీస్లో కివీ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా.. 15 సంవత్సరాల తర్వాత శ్రీలంక తన చారిత్రక విజయాన్ని రిపీట్ చేసింది. శ్రీలంక ఈ విజయం తర్వాత.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
Venkaiah Naidu: ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం
Also Read
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్కు గుడ్బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
పాయింట్ల పట్టికలో శ్రీలంక స్థానం మరింత పటిష్టంగా మారి మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక జట్టు 2023-25 సైకిల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. శ్రీలంక గెలుపు శాతం ఇప్పుడు 55.56గా ఉంది. మరోవైపు.. శ్రీలంక చేతిలో రెండు వరుస పరాజయాల తర్వాత, న్యూజిలాండ్ జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 3 గెలిచింది. 5 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ జట్టు విజేత శాతం ప్రస్తుతం 37.50 ఉంది. కాగా.. తర్వాత న్యూజిలాండ్ భారత్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.
Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
శ్రీలంక విజయం తర్వాత భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో భారత్ 7 గెలిచింది. 2 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ విజేత శాతం 71.67 ఇది అత్యధికం. ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కంటే కొంచెం దిగువన ఉంది, విజయ శాతం 62.50. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఈ జట్టు 8 మ్యాచ్లు గెలవగా, 3 ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 5వ స్థానం, దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ 8వ స్థానంలో, వెస్టిండీస్ 9వ స్థానంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్కు గుడ్బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!