Venkaiah Naidu: ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం
- విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక
- ‘నవతీ ప్రసన్నం’ పేరిట కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ) మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాలులో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం అని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆనందకర జీవితం అందరూ కోరుకుంటారు.. దానిని సాధ్యం చేసుకోవడం గొప్పదని సూచించారు. వ్యక్తి ఆలోచనకు సానుకూల ధోరణి అవసరం.. యువకులు ప్రకృతితో కలిసి జీవించాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. మరణించిన తరువాత జీవించాలి అంటే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి.. విశాఖలో తెన్నేటి విశ్వనాథం పరిచయంతో తన జీవిన శైలి మారిందని తెలిపారు. విశాఖలో ప్రముఖులు వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చూడగలిగానని అన్నారు.
Read Also: Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. ఆచార్య ప్రసన్న కుమార్ ఆంగ్ల ఉపన్యాసం ఆసక్తికరంగా ఉండేది.. వెంకయ్య నాయుడుకి, ప్రసన్న కుమార్కి పోలిక ఉందని అన్నారు. ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులుగా గెలిచారు.. ప్రసన్న కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో డాల్ఫీన్ డైరీస్ కథనాలు రాశారన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మంచి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చారు.. ఎడ్యుకేషన్ పాలసీ పై శ్రద్ధ ప్రభుత్వ స్థాయిలలో కనిపించడం లేదని తెలిపారు. ఉప కులపతి అంటే ఒక కులం వారినే వేయాలని అనుకుంటున్నారు.. మేధావులను, విజ్ఞాన ప్రముఖులను విశ్వ విద్యాలయ ఉప కులపతులు ఐతే విశ్వ విద్యాలయాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!