Rammohan Naidu: శ్రీకాకుళం రైల్వే ప్రయాణీకుల కష్టాలకు చెక్.. ఫలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రైల్వే స్టేషన్లలో హాల్టులు మంజూరయ్యాయి. ఇకపై బెర్హంపూర్–విశాఖ ఎక్స్ప్రెస్ (18525/18526) తిలారు స్టేషన్లో ఆగనుంది. అలాగే పూరి–అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ (12843/12844) ఇచ్చాపురం స్టేషన్లో, భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (22819/22820) బారువ స్టేషన్లో హాల్ట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రయాణీకులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
READ MORE: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!.. ఈ నంబర్కి సమాచారం ఇవ్వండి..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఈ ప్రత్యేక హాల్టుల అంశాన్ని గతంలోనే రైల్వే సమీక్ష సమావేశాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ప్రజల అవసరాలను వివరించి, హాల్టులు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆయన కృషికి ఫలితంగా రైల్వే శాఖ నుంచి సానుకూల నిర్ణయం వెలువడింది. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, జిల్లావాసులు మంత్రి చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే హాల్టుల మంజూరుతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మరో అడుగు ముందుకేసినట్టయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: Realme 16 Pro 5G Launch: రియల్మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్ అవసరం లేదు!
కాగా.. “శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు చేశారు. ప్రజా ప్రయోజనాన్ని ప్రధానంగా తీసుకుని, ఈ అంశంపై నేను ఎంతోకాలంగా నిరంతరం కృషి చేస్తున్నాను. సానుకూల స్పందన ఇచ్చి సహకరించిన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కి, అలాగే రైల్వే అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నిర్ణయం శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు.” అని మంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు… pic.twitter.com/19NJovMtvz
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) January 2, 2026
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!