India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- భారత్ - పాకిస్తాన్ మధ్య ఖైదీల జాబితా మార్పిడి..
- 188 మంది భారతీయుల రిహాబిలిటేషన్కు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Pakistan: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య బుధవారం ఒక కీలకమైన మానవీయ చొరవ చోటుచేసుకుంది. 2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలను పంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా తమ అదుపులో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి.
ఏ దేశంలో ఎంతమంది ఖైదీలంటే..
భారతదేశం తన ఆధీనంలో ఉన్న 386 మంది పాకిస్థానీ పౌర ఖైదీలు, 53 మంది మత్స్యకారుల జాబితాను పాక్కు అప్పగించింది. మరోవైపు పాకిస్థాన్ తన జైళ్లలో ఉన్న 52 మంది భారతీయ పౌర ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్తో పంచుకుంది. పాకిస్థాన్ జైళ్లలో ఇప్పటికే శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా విముక్తి లభించని 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి తమ స్వదేశానికి పంపించాలని భారతదేశం గట్టిగా డిమాండ్ చేసింది. అలాగే భారతీయులుగా భావిస్తున్న మరో 13 మంది పౌర ఖైదీలకు ఇంకా దౌత్యపరమైన సేవలు (కాన్సులర్ యాక్సెస్) అందలేదని, వారికి తక్షణమే ఆ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసింది. ఖైదీలు విడుదలయ్యేంత వరకు వారి భద్రత, సంరక్షణ, శ్రేయస్సుకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరింది. దీంతో పాటు గల్లంతైన భారత రక్షణ సిబ్బందిని కూడా త్వరగా అప్పగించాలని భారత్ పునరుద్ఘాటించింది.
Also Read
- US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్తో మళ్లీ టెన్షన్..
- Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
2014 నుంచి 2,700 పైగా భారతీయుల పునరాగమనం
కేంద్ర ప్రభుత్వ నిరంతర దౌత్య ప్రయత్నాల కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ నుంచి 2,661 మంది భారతీయ మత్స్యకారులు, 78 మంది పౌర ఖైదీలు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇందులో 2023 తర్వాత విడుదలైన 500 మంది మత్స్యకారులు, 20 మంది పౌర ఖైదీలు కూడా ఉన్నారు. పహల్గామ్ దాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అనేక రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఉగ్రవాదం, సరిహద్దు రక్షణ విషయంలో భారత్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, ఖైదీల విషయంలో మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం అని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!