Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Special Trains To Ayodhya Railway Department Good News For Devotees

Ayodhya: అయోధ్యకు స్పెషల్ ట్రైన్లు.. భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..

Published Date :January 18, 2024 , 6:31 pm
By Rajesh Veeramalla
Ayodhya: అయోధ్యకు స్పెషల్ ట్రైన్లు.. భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ‘ఆస్తా’ పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. భక్తుల డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుండి ప్రత్యేక ఆస్తా రైళ్లు ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అగర్తలా, టిన్సుకియా, బార్మర్, కత్రా, జమ్ము, నాసిక్, డెహ్రాడూన్, భద్రక్, ఖుర్దా రోడ్, కొట్టాయం, సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట నుంచి కూడా ఆస్తా స్పెషల్ ట్రైన్లు నడువనున్నాయి.

తమిళనాడులో చెన్నై, సేలం, మదురై సహా తొమ్మిది స్టేషన్ల నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పూణే, ముంబై, వార్ధా, జల్నా, నాసిక్‌లోని మొత్తం ఏడు స్టేషన్ల నుండి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజు అంటే జనవరి 22 నుంచి 100 రోజుల పాటు అయోధ్య నుంచి భారతదేశంలోని వివిధ నగరాలలో నడుస్తాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే రౌండ్-ట్రిప్ టిక్కెట్లు ఉంటాయి. అంటే డబుల్ వే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 100 రోజుల వ్యవధిలో రోజూ 50,000 నుంచి 55,000 మంది భక్తులు రైలులో అయోధ్య ధామ్ స్టేషన్‌కు ప్రయాణిస్తారని భారతీయ రైల్వే అంచనా వేసింది. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి మరికొద్ది రోజులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌ను పొడిగించవచ్చు.

TTE Suspend: టికెట్ లేదని ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాగా.. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు శాకాహారం మాత్రమే సర్వ్ చేస్తారు. రైల్వే నిర్వాహకులు అందించిన ప్రయాణికుల జాబితాలో ఆధార్ నంబర్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటి ప్రయాణికుల వివరాలు యాడ్ చేస్తారు. అంతేకాకుండా.. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలు, క్యాటరింగ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జ్, GST వంటి ఛార్జీలు వర్తిస్తాయి.

ఆస్తా రైళ్లకు పరిమిత స్టాప్‌లు ఉంటాయి. అవి కూడా ట్రైన్ ఆపరేషన్ పనుల కోసమే ఆగుతాయి. ఇవి వివిధ రాష్ట్రాలలోని టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి నడుస్తాయి. ఆస్తా రైళ్లు నడిచే రాష్ట్రాలలో ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, జమ్ము కశ్మీర్‌ తదితర ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ఈ ఆస్తా ట్రైన్స్ సికింద్రాబాద్ – అయోధ్య – సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్ – అయోధ్య – కాజీపేట జంక్షన్ రూట్స్‌లో నడుస్తాయి. రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్య వెళ్లాలనుకునే ఏపీ భక్తులకు వైజాగ్ నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.

Khammam: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. తప్పిన పెను ప్రమాదం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya
  • devotees
  • good news
  • indian railway
  • special trains

తాజావార్తలు

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

  • Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

  • PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్‌ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..

  • Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!

  • Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions