Off The Record : గ్రాఫ్ తగ్గించుకున్నప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలనొప్పికి… కాలు నొప్పికి ఒకే మాత్ర పనికిరాదు నాయనా…! మాటైనా, మాత్ర అయినా సందర్భానికి, అవసరానికి తగ్గట్టుగా ఉండాలే తప్ప అన్నిటీకీ దూకుడు మంత్రం పనికిరాదని వైసీపీ నాయకత్వం ఆ మంత్రికి తలంటిందట. కాస్త వెనకా ముందూ చూసుకుని మాట్లాడమని స్మూత్ వార్నింగ్ ఇచ్చిందట. ప్రతి విషయంలో కౌంటర్కి ఎన్కౌంటర్ వర్కవుట్ కాదని కూడా చెప్పిందట. ఇంతకీ ఎవరా ఏపీ మంత్రి? ఏ విషయంలో తగ్గి మాట్లాడమని అధిష్టానం చెప్పింది?
శ్రీకాకుళం జిల్లాలో హేమా హేమీలను కాదని మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. మెదటిసారి ఎమ్మెల్యే అయినా అమాత్యునిగా అవకాశం కొట్టేశారు. అగ్రెసివ్గా మాట్లాడితేనే వైసీపీ అధిష్టానం గుర్తిస్తుందని అనుకుంటారో… లేక నేనింతే… అన్నట్టుగా మాట్లాడతారోగాని….రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చెలరేగిపోతుంటారు మంత్రి. కాస్త తన గ్రాఫ్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తుంటారన్న ఇంటర్నల్ టాక్ కూడా ఉందట. అలాంటి సీదిరి ఈసారి తెలంగాణ నాయకుల విషయంలో నోరుజారి వైసీపీ నాయకత్వంతో తలంటించుకున్నారట. ఏంటా మాటలు అంటూ సీరియస్ అయిందట. తెలంగాణలో మళ్లీ దొరల పాలన వచ్చిందని అంటూ… దానికి మరికొన్ని అనవసర వ్యాఖ్యానాలు జోడించారట సీదిరి. ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ నాయకత్వం సున్నితమైన విషయాల్లో మరీ అంత దూకుడొద్దమ్మా…. అంటూ బ్రేకులేసిందట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం సీదిరి అలా మాట్లాడి ఉండకూడదన్నారట.
Also Read
- Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
అధిష్టానం అక్షింతలంటూ మేటర్ సోషల్ మీడియాకెక్కడంతో…నష్టనివారణ చర్యలు చేపట్టారట హల్చల్ మినిస్టర్. తనకేమీ వ్యక్తిగత ఎజెండా లేదని , రాష్ర్ట ప్రయోజనాల కోసమే అలా మాట్లాడానని కవరింగ్ ఇచ్చుకుంటున్నారట. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటూనే.. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తే ఎలాగని అడుగుతున్నారట. మంత్రి వ్యాఖ్యల మీద జిల్లాలో మిశ్రమ స్పందన వస్తోంది. అధిష్టానం పెద్దలు స్పీడ్ కు కాస్త బ్రేకులు వేయాలని చెబుతుంటే , క్రిందిస్దాయి లీడర్స్ మాత్రం మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ నేతలకు సరైన కౌంటర్ గానే చెప్పుకుంటున్నారట. మొత్తం మీద మంత్రి సీదిరి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని సూచిస్తున్నారంట అధిష్టానం పెద్దలు . విమర్శల్ని తిప్పికొట్టడం తప్పుకాదు గానీ…మరీ శృతి మించి బోర్డర్ లైన్ దాటొద్దని ఆదేశించిందట.
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!