Off The Record : గ్రాఫ్ తగ్గించుకున్నప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలనొప్పికి… కాలు నొప్పికి ఒకే మాత్ర పనికిరాదు నాయనా…! మాటైనా, మాత్ర అయినా సందర్భానికి, అవసరానికి తగ్గట్టుగా ఉండాలే తప్ప అన్నిటీకీ దూకుడు మంత్రం పనికిరాదని వైసీపీ నాయకత్వం ఆ మంత్రికి తలంటిందట. కాస్త వెనకా ముందూ చూసుకుని మాట్లాడమని స్మూత్ వార్నింగ్ ఇచ్చిందట. ప్రతి విషయంలో కౌంటర్కి ఎన్కౌంటర్ వర్కవుట్ కాదని కూడా చెప్పిందట. ఇంతకీ ఎవరా ఏపీ మంత్రి? ఏ విషయంలో తగ్గి మాట్లాడమని అధిష్టానం చెప్పింది?
శ్రీకాకుళం జిల్లాలో హేమా హేమీలను కాదని మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. మెదటిసారి ఎమ్మెల్యే అయినా అమాత్యునిగా అవకాశం కొట్టేశారు. అగ్రెసివ్గా మాట్లాడితేనే వైసీపీ అధిష్టానం గుర్తిస్తుందని అనుకుంటారో… లేక నేనింతే… అన్నట్టుగా మాట్లాడతారోగాని….రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చెలరేగిపోతుంటారు మంత్రి. కాస్త తన గ్రాఫ్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తుంటారన్న ఇంటర్నల్ టాక్ కూడా ఉందట. అలాంటి సీదిరి ఈసారి తెలంగాణ నాయకుల విషయంలో నోరుజారి వైసీపీ నాయకత్వంతో తలంటించుకున్నారట. ఏంటా మాటలు అంటూ సీరియస్ అయిందట. తెలంగాణలో మళ్లీ దొరల పాలన వచ్చిందని అంటూ… దానికి మరికొన్ని అనవసర వ్యాఖ్యానాలు జోడించారట సీదిరి. ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ నాయకత్వం సున్నితమైన విషయాల్లో మరీ అంత దూకుడొద్దమ్మా…. అంటూ బ్రేకులేసిందట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం సీదిరి అలా మాట్లాడి ఉండకూడదన్నారట.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
అధిష్టానం అక్షింతలంటూ మేటర్ సోషల్ మీడియాకెక్కడంతో…నష్టనివారణ చర్యలు చేపట్టారట హల్చల్ మినిస్టర్. తనకేమీ వ్యక్తిగత ఎజెండా లేదని , రాష్ర్ట ప్రయోజనాల కోసమే అలా మాట్లాడానని కవరింగ్ ఇచ్చుకుంటున్నారట. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటూనే.. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తే ఎలాగని అడుగుతున్నారట. మంత్రి వ్యాఖ్యల మీద జిల్లాలో మిశ్రమ స్పందన వస్తోంది. అధిష్టానం పెద్దలు స్పీడ్ కు కాస్త బ్రేకులు వేయాలని చెబుతుంటే , క్రిందిస్దాయి లీడర్స్ మాత్రం మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ నేతలకు సరైన కౌంటర్ గానే చెప్పుకుంటున్నారట. మొత్తం మీద మంత్రి సీదిరి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని సూచిస్తున్నారంట అధిష్టానం పెద్దలు . విమర్శల్ని తిప్పికొట్టడం తప్పుకాదు గానీ…మరీ శృతి మించి బోర్డర్ లైన్ దాటొద్దని ఆదేశించిందట.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!