Off The Record: స్పీకర్ విచారణకు హాజరుకాని ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి?
- 8మంది ఎమ్మెల్యేల విచారణ, ఐదుగురి విషయంలో తీర్పు
- ఐదుగురి అనర్హత పిటిషన్స్ డిస్మిస్
- బీఆర్ఎస్ సరైన ఆధారాలు ఇవ్వలేకపోయిందన్న స్పీకర్
- ఇంకా విచారణకు హాజరవని దానం, కడియం
- పోచారం, కాలే యాదయ్య, సంజయ్పై తీర్పు పెండింగ్
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణకు హాజరవని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి? లిస్ట్లో మొత్తం పది మంది ఉంటే… 8మందిని విచారించి ఐదుగురి విషయంలోనే తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆ ముగ్గురి విషయంలో తీర్పు ఎప్పుడు? ప్రస్తుతం బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వరుసగా జడ్జిమెంట్ ఇస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది విచారణ ముగియగా… ఐదుగురి విషయంలో మాత్రమే తన నిర్ణయాన్ని ప్రకటించారు స్పీకర్. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి మీదున్న అనర్హత పిటిషన్స్ డిస్మిస్ చేశారాయన. అంటే వీళ్ళు ఎవరూ పార్టీ ఫిరాయించలేదన్నది స్పీకర్ జడ్జిమెంట్. వాళ్ళు పార్టీ ఫిరాయించారనడానికి సరైన ఆధారాలు బీఆర్ఎస్ సమర్పించలేకపోయిందని అభిప్రాయపడ్డారు గడ్డం ప్రసాద్కుమార్. దీంతో వాళ్ళు సభ్యులుగా సభలో కొనసాగుతారంటూ తన తీర్పులో పేర్కొన్నారాయన. పార్టీ మారిన మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు.
Also Read
Also Read:Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే..
ఆ సంగతి ఎలా ఉన్నా… విచారణ ముగించిన ఎమ్మెల్యేల్లో ఇంకా ముగ్గురి సంగతిని ఎందుకు పెండింగ్ పెట్టారన్నది ఇప్పుడు క్వశ్చన్. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ విచారణ ముగిసింది. స్పీకర్ తీర్పును ప్రకటించాల్సి ఉంది. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు తీర్పు ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ముందే ప్రకటించేశారని, మిగతా వాళ్ళ విషయంలో టైం తీసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి వచ్చిన ఆర్గుమెంట్స్ తోపాటు… ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read:The Rajasaab Premieres: ప్రభాస్ ‘రాజా సాబ్’ అప్డేట్.. ప్రీమియర్స్ ఎప్పుడో తెలుసా?
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న క్రమంలో…ఎలాంటి సాక్ష్యాలు లేని ఐదుగురి విషయంలో నిర్ణయం తీసుకుని మిగతా వాటిని పెండింగ్లో పెట్టి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. గడువులోపు ఎంతో కొంత విచారించిన రిపోర్ట్ను సుప్రీం కోర్ట్కు సబ్మిట్ చేస్తే… వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. మొత్తం మీద చాలా రోజులుగా జరుగుతున్న విచారణలో ఓ పర్వం ముగిసిందని అంటున్నారు. అయితే స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవబోతోంది. అందుకు స్పీకర్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్న.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!