Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే..
- పాకిస్తాన్కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న ఆఫ్ఘాన్..
- భారత దారిలోనే తాలిబాన్లు..
- కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్ట్..
- ఇప్పటికే సింధూ జలాలను నిలిపేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: పాకిస్తాన్కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: Kadiyam Srihari: కాంగ్రెస్లో చేరలేదు.. ఆ ప్రచారం అబద్ధం
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కునార్ నది నుంచి నీటిని దేశంలోని నంగర్హార్ ప్రాంతానికి మళ్లించే ప్రణాళికను ముందుకు తెచ్చింది. ఇప్పటికే, ఆఫ్ఘాన్-పాక్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ప్రణాళిక ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత పెంచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రధానమంత్రి కార్యాలయ ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో, కునార్ నది నుండి నంగర్హార్లోని దారుంటా డ్యామ్కు నీటిని బదిలీ చేసే ప్రతిపాదన చర్చల తర్వాత ఆమోదించబడిందని, తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్కు పంపబడిందని చెప్పింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే నంగర్హార్ లోని అనేక వ్యవసాయ భూములకు నీటి కొరతను పరిష్కరించవచ్చు. ఒక వేళ ఈ ప్రాజెక్టు పూర్తిగా కార్యరూపంలోకి వస్తే, పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా నీటి కొరను ఎదుర్కోవాల్సిందే.
సుమారు 500 కిలోమీటర్ల పొడవున ప్రవహించే కునార్ నది, పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ జిల్లాలోని హిందూ కుష్ పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఆ తర్వాత దక్షిణంగా ప్రవహించి ఆఫ్ఘనిస్తాన్ లోకి వస్తుంది. కునార్, నంగర్హార్ ప్రావిన్సల గుండా ప్రవహించి, కాబూలో నదిలో కలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్లోకి ప్రవేశించిస్తుంది. పాక్లోని అటాక్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తుంది. ఇది పాకిస్తాన్లో ప్రవహించే అతిపెద్ద నదుల్లో ఒకటి. ఆఫ్ఘాన్ కునార్ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే పాక్ దెబ్బతినడం ఖాయం.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!