Adilabad: జాగిలాల కోసం ఈత కొలను.. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
- జాగిలాల కోసం ఈత కొలను
- ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదిలాబాద్ జిల్లాలో పోలీసులు జాగిలాల కోసం ఓ ఈత కొలను ప్రారంభించారు. జాగిలాలకు వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా వేసవి ఉపశమనంకై ఈత కొలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లాలో 8 జాగిలాలకు ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయగా విధులను నిర్వర్తించి ఈత కొలనులో జలకాలాడి సేద తీరనున్నాయి జాగిలాలు. జాగిలాలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు విధులయందు ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాగిలాల బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈతకొలనును ప్రారంభించారు.
Also Read:Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
Also Read
- APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జాగిలాలు విధులు నిర్వర్తించి సేద తీరడానికి ఈ ఈతకొలను ఉపయోగపడుతుందని తెలిపారు. వేసవికాలంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వాటి ఆరోగ్యం దృష్ట్యా ఈతకొలనును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా అత్యవసర సమయాలలో నదులలో, వాగులలో తమను తాము కాపాడుకోవడానికి, ఇతరులను రక్షించడానికి జాగిలాలకు ప్రత్యేకంగా ఈత అవసరం ఎంతగానో ఉంటుందని, అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మందస్తు జాగ్రత్తలతో ఈ ఈతకొలను ప్రారంభించి శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు.
Also Read:Gang R*pe: ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్ కూతురిపై 8 సార్లు గ్యాంగ్ రేప్ చేయించి..!
జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది జాగిలాలు ఉండగా అందులో ఐదు పేలుడు పదార్థాలను కనుగొనే జాగిలాలు, రెండు నేరస్తులను పట్టుకునే విధంగా శిక్షణ పొందిన జాగిలాలు, మాదక ద్రవ్యాలను, గంజాయి లాంటి వాటిని కనుగొనడంలో ఉన్న ఒక జాగిలం అందుబాటులో ఉందని తెలిపారు. వీటన్నిటికీ ఈతకొలను ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, ఎన్ చంద్రశేఖర్, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ పి రమేష్, సాయుధ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..