Southwest Monsoon: గుడ్ న్యూస్.. మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Southwest Monsoon Likely to hit Andaman Coast on May 19th: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఉపరితల ద్రోణి తాకనుంది.
Also Read: YS Jagan: జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది: వైఎస్ జగన్
Also Read
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజులు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీన అండమాన్ తీరాన్ని తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 31న కేరళకు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేరళను నైరుతి పవనాలు తాకిన తర్వాతే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద పేర్కొన్నారు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. జూన్, జూలై నెలలు వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!