South Central Railway GM : ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.. ప్రయాణికులు సురక్షితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ట్రాక్ పునరుద్దరణ పనులను జీఎం పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్ కు బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పినట్టుగా చెప్పారు అరుణ్ కుమార్ జైన్. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా మాకు సమాచారం అందిందని, 16 పైగా భోగీలతో విశాఖ నుండి హైదరాబాద్ కు గోదావరి ఎక్స్ప్రెస్ బయల్దేరిందన్నారు అరుణ్ కుమార్ జైన్.
Also Read : Trains Cancelled : పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అందులో ఆరు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలు చేర్చామని అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, ఇవాళ రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం దెబ్బతిన్న రైల్వే లైన్ కాకుండా మరో లైన్ ద్వారా రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Also Read : Aero India 2023: ఏరో ఇండియా థీమ్ ఇదే
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?