T20 World Cup 2024: రోహిత్, ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు: గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly On Rinku Singh T20 World Cup 2024 Snub: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన జట్టునే ఎంపిక చేశారన్నారు. వెస్టిండీస్ పిచ్లు కాబట్టి సెలక్టర్లు అదనంగా ఓ స్పిన్నర్ను ఎంపిక చేసి ఉంటారని, అందుకే రింకు సింగ్కు అవకాశం దక్కి ఉండకపోవచ్చని దాదా అభిప్రాయపడ్డారు. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 30న ప్రకటించిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ‘వెస్టిండీస్ పిచ్లు మందకొడిగా ఉంటాయి. అందుకే బీసీసీఐ సెలక్టర్లు అదనంగా మరొ స్పిన్నర్ను ఎంపిక చేసుంటారు. అందుకే రింకు సింగ్కు అవకాశం దక్కలేదు. రింకు ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో మెరుస్తున్నాడు. అతడికి భవిష్యత్తులో తప్పకుండా అవకాశం వస్తుంది. భారత్ ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. అందరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు’ అని గంగూలీ అన్నారు.
Also Read
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
Also Read: Pawan Kalyan: నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!
‘టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ రేసులో భారత్, ఆస్ట్రేలియా ముందుంటాయని నేను అనుకుంటున్నా. వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శిస్తాయి’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.
తాజావార్తలు
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!