Opposition meet: విపక్షాల సమావేశానికి సోనియా.. 24 పార్టీలకు ఆహ్వానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition meet: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఐక్యతను పెంపొందించడానికి ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జూన్ 23న బీహార్లోని పాట్నాలో జరిగింది. 24 రాజకీయ పార్టీల నాయకులు జూలై 17న బెంగళూరులో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజు మరిన్ని అధికారిక చర్చలు జరుగుతాయి. ఈ సమావేశంలో పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read: Modi Tour: మరో 26 రాఫెల్ విమానాలు.. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన వేళ కీలక ఒప్పందానికి ఛాన్స్
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
ఎనిమిది కొత్త పార్టీలు.. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు జూలై 17న సమావేశంలో చేరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత సమావేశం జులై 13 నుంచి జులై 17కి వాయిదా పడింది.
Also Read: Union Cabinet Expansion: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ మార్పులు ఉంటాయా?
పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని 15 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్పై కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ఇచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి సమావేశాలలో భాగం కావడం కష్టమని తేల్చిచెప్పడంతో విభేదాలు వెలువడ్డాయి. పాట్నా సమావేశం తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో.. ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను సరళమైన విధానంతో పక్కన పెట్టి ఉమ్మడి ఎజెండా, రాష్ట్రాల వారీ వ్యూహంతో ఎన్నికల్లో పోరాడతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?