Tragedy: టవల్ తో గొంతు పిసికి నోట్లో గుడ్డలు కుక్కి.. ఆస్తి కోసం అత్తను హత్య చేసిన అల్లుడు
- ఆస్తి కోసం అత్తను హత్య చేసిన అల్లుడు
- భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ
- రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని రాములమ్మ చెప్పింది
- భూమి మొత్తం తనకే దక్కాలని అల్లుడు జీవన్ రెడ్డి అత్తపై కక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తు్న్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా కొండపాక (మం) తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం చిన్నల్లుడు అత్తను హత్య చేశాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ ( 55). ఆరు నెలల క్రితం తన పేరుపై ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని రాములమ్మ చెప్పింది. భూమి మొత్తం తనకే దక్కాలని అల్లుడు జీవన్ రెడ్డి అత్తపై కక్ష పెంచుకున్నాడు. మధ్యాహ్నం జీవన్ రెడ్డి అత్తింటికి స్నేహితులతో కలిసి వచ్చాడు.
Also Read:Maa Inti Bangaram: మీరు చూస్తా ఉండండి.. సంక్రాంతికి సమంత సర్ప్రైజ్!
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ఎవరికి అనుమానం రాకుండా స్నేహితులతో కలిసి టవల్ తో గొంతు పిసికి నోట్లో గుడ్డలు కుక్కి అత్తని హత్య చేశాడు అల్లుడు. అనంతరం చెవిలోని కమ్మలు తీసుకొని పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు రాములమ్మ మృతి చెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మృతురాలి కూతుర్లు అక్కడికి చేరుకున్నారు. వాళ్లతో పాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా బట్టలు మార్చుకుని వచ్చి అల్లుడు దొంగ ఏడుపు ఏడ్చాడు. కుమార్తెల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలో చూడగా అల్లుడి బాగోతం బయటపడింది. అల్లుడు జీవన్ రెడ్డి అత్తను హత్య చేసినట్లు గుర్తించారు. జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!