Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Somu Veerraju Key Comments On Janasena And Bjp Alliance

Somu Veerraju: పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ చెప్పాం..

Published Date :May 19, 2023 , 2:38 pm
By Sudhakar Ravula
Somu Veerraju: పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ చెప్పాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల విషయంలో పవన్‌ కల్యాణ్‌ వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. అయితే, ఈ సమావేశంలో పొత్తులపై చర్చ జరగడం లేదంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.

ఇక, అకాల వర్షాల వల్ల ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ప్రకటించడం లేదని వాపోయారు సోమువీర్రాజు.. కేంద్రం గోనె సంచులు ఇస్తోన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత సంచులను రైతులకు ఇస్తోందని.. జగన్ ప్రభుత్వం గోనె సంచుల కుంభకోణానికి పాల్పడుతోందని ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించినా.. రాష్ట్రం మిల్లర్లకు కొమ్ము కాస్తూ దోపిడీకి సహకరిస్తుంది.. ఏపీలో ధాన్యం కొనుగోళ్లల్లో ప్రతేడాది రూ. 1000 కోట్ల కుంభకోణం జరుగుతోంది.. ఆర్బీకేలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి.. టిడ్కో ఇళ్లను కేంద్రం కేటాయించినా లబ్దిదారులకు ఇళ్లను ఇవ్వడం లేదు.. అవభూముల్లో భారీ కుంభకోణం జరిగుతోంది.. ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాలను.. ప్రభుత్వం అక్రమాలను ఛార్జ్ షీట్ల దాఖలు కార్యక్రమంలో చేపట్టాలి. ఈ ప్రభుత్వానికి బ్రాందీ మీదున్న అవగాహన ఆయుష్ మీద లేకపోవడం బాధాకరం అంటూ ఫైర్‌ అయ్యారు.

విభాగాల వారీగా.. మోర్చాల వారీగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు సోము వీర్రాజు.. ఎమ్మెల్యేల అవినీతిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నాం.. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు దారుణంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత సురేష్ తలను కాళ్ల మధ్యలో నొక్కి పెట్టిన దారుణం చూశాం.. పోలీసుల దమనకాండపై గవర్నర్‌ను కలుస్తామని వెల్లడించారు. వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బ్రాందీలను తయారు చేసేస్తున్నారు.. బ్రాండ్ల పేరు కూడా చెప్పడం లేదు.. గుర్తుండకుండా చేస్తున్నారని విమర్శించారు. బొప్పాయి ముక్కల అమ్మే బండి మీద ఆన్ లైన్ పేమెంట్లు జరుగుతోంటే.. జగన్ బ్రాందీ షాపుల్లో మాత్రం ఆన్ లైన్ ఉండడం లేదని ఎద్దేవా చేశారు.

మరోవైపు.. కరెంట్ కోతలు పెరిగాయి.. ప్రజా కార్యక్రమాలు.. రాబరీ కార్యక్రమాలుగా మారాయని విమర్శించారు వీర్రాజు.. సీఆర్డీఏలో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలంట.. మిగిలిన చోట్ల ఇళ్లు త్వరగా కట్టక్కర్లేదా..? అని నిలదీశారు. సీఆర్డీఏలో ఏంటీ కవ్వింపు చర్యలేంటీ..? ఎందుకీ వర్గ రాజకీయాలు..? 22 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే.. కేవలం 8 లక్షల ఇళ్ల పనులనే మొదలు పెడతారా..? మిగిలిన ప్రాంతాల్లో ఇళ్లు కట్టలేని ఈ ప్రభుత్వం సీఆర్డీఏలో ఇళ్లు కడుతుందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పార్టీ బీఆర్ఎస్ పెట్టింది… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పెడతారట.. పార్టీ కార్యాలయం పెడతారట.. అయినా, ఏపీలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటామని ప్రకటించారు.. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు నరేంద్ర మోడీ విధానాలపై ప్రచారం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నెల రోజుల పాటు ఎండగడతామన్నారు. ఇంకో వైపు.. మీడియా ప్రతినిధులపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఖండించారు సోమువీర్రాజు.. అవినాష్ రెడ్డి అనుచరులు దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం పెద్దలు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • janasena
  • Janasena and BJP Alliance
  • Somu Veerraju

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు

  • Superstar Krishna : కత్తిపోటు లేకుండా కృష్ణ గారి సినిమా మార్నింగ్ షో పడదు :శివాజీ

  • Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..

  • AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!

  • Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్

ట్రెండింగ్‌

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions