Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Somu Veerraju Key Comments On Janasena And Bjp Alliance

Somu Veerraju: పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ చెప్పాం..

Published Date :May 19, 2023 , 2:38 pm
By Sudhakar Ravula
Somu Veerraju: పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ చెప్పాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల విషయంలో పవన్‌ కల్యాణ్‌ వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. అయితే, ఈ సమావేశంలో పొత్తులపై చర్చ జరగడం లేదంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.

ఇక, అకాల వర్షాల వల్ల ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ప్రకటించడం లేదని వాపోయారు సోమువీర్రాజు.. కేంద్రం గోనె సంచులు ఇస్తోన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత సంచులను రైతులకు ఇస్తోందని.. జగన్ ప్రభుత్వం గోనె సంచుల కుంభకోణానికి పాల్పడుతోందని ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించినా.. రాష్ట్రం మిల్లర్లకు కొమ్ము కాస్తూ దోపిడీకి సహకరిస్తుంది.. ఏపీలో ధాన్యం కొనుగోళ్లల్లో ప్రతేడాది రూ. 1000 కోట్ల కుంభకోణం జరుగుతోంది.. ఆర్బీకేలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి.. టిడ్కో ఇళ్లను కేంద్రం కేటాయించినా లబ్దిదారులకు ఇళ్లను ఇవ్వడం లేదు.. అవభూముల్లో భారీ కుంభకోణం జరిగుతోంది.. ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాలను.. ప్రభుత్వం అక్రమాలను ఛార్జ్ షీట్ల దాఖలు కార్యక్రమంలో చేపట్టాలి. ఈ ప్రభుత్వానికి బ్రాందీ మీదున్న అవగాహన ఆయుష్ మీద లేకపోవడం బాధాకరం అంటూ ఫైర్‌ అయ్యారు.

విభాగాల వారీగా.. మోర్చాల వారీగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు సోము వీర్రాజు.. ఎమ్మెల్యేల అవినీతిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నాం.. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు దారుణంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత సురేష్ తలను కాళ్ల మధ్యలో నొక్కి పెట్టిన దారుణం చూశాం.. పోలీసుల దమనకాండపై గవర్నర్‌ను కలుస్తామని వెల్లడించారు. వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బ్రాందీలను తయారు చేసేస్తున్నారు.. బ్రాండ్ల పేరు కూడా చెప్పడం లేదు.. గుర్తుండకుండా చేస్తున్నారని విమర్శించారు. బొప్పాయి ముక్కల అమ్మే బండి మీద ఆన్ లైన్ పేమెంట్లు జరుగుతోంటే.. జగన్ బ్రాందీ షాపుల్లో మాత్రం ఆన్ లైన్ ఉండడం లేదని ఎద్దేవా చేశారు.

మరోవైపు.. కరెంట్ కోతలు పెరిగాయి.. ప్రజా కార్యక్రమాలు.. రాబరీ కార్యక్రమాలుగా మారాయని విమర్శించారు వీర్రాజు.. సీఆర్డీఏలో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలంట.. మిగిలిన చోట్ల ఇళ్లు త్వరగా కట్టక్కర్లేదా..? అని నిలదీశారు. సీఆర్డీఏలో ఏంటీ కవ్వింపు చర్యలేంటీ..? ఎందుకీ వర్గ రాజకీయాలు..? 22 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే.. కేవలం 8 లక్షల ఇళ్ల పనులనే మొదలు పెడతారా..? మిగిలిన ప్రాంతాల్లో ఇళ్లు కట్టలేని ఈ ప్రభుత్వం సీఆర్డీఏలో ఇళ్లు కడుతుందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పార్టీ బీఆర్ఎస్ పెట్టింది… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పెడతారట.. పార్టీ కార్యాలయం పెడతారట.. అయినా, ఏపీలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటామని ప్రకటించారు.. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు నరేంద్ర మోడీ విధానాలపై ప్రచారం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నెల రోజుల పాటు ఎండగడతామన్నారు. ఇంకో వైపు.. మీడియా ప్రతినిధులపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఖండించారు సోమువీర్రాజు.. అవినాష్ రెడ్డి అనుచరులు దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం పెద్దలు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • janasena
  • Janasena and BJP Alliance
  • Somu Veerraju

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions