Somireddy Chandramohan Reddy: టీడీపీలోకి వైసీపీ నేతలు… పోలీసుల అత్యుత్సాహంపై సోమిరెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయా? అంటే అవునంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ నుండి టీడీపీ లోకి కొంతమంది యువకులు చేరుతున్నారన్న సమాచారంతో పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు. ప్రయత్నం చేశారన్నారు. వెంకటాచలం మండలం లోని వైసిపి లో ఉన్న యువకులు టిడిపిలో చేరేందుకు వెంకటాచల మండల కేంద్రం కు వస్తుండగా హైవే పై పోలీసులు ఓవరాక్షన్ చేసి పోలీసు వాహనాలను అడ్డుపెట్టి యువకుల ద్విచక్ర వాహనాలను ఆపి తాళాలను తీసుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read Also:Thurs Day Sai Baba Special Pooja Live: గురువారం శ్రీసాయి చాలీసా వింటే..
Also Read
సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పార్టీ కార్యాలయం చేరుకొని దాదాపు 50 మంది యువకులకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పార్టీలోకి చేరేందుకు వస్తున్న యువకులను నిలిపి వారి వాహనాల తాళాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ఏమి చేసినా పట్టించుకోని పోలీసులు ఇక్కడ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని విమర్శించారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం వైసీపీకి చెందిన ఓ యువనేత టీడీపీలో చేరేందుకు తన మద్దతుదారులతో కలిసి బైక్లపై టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్నారు. అయితే.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఏకంగా జాతీయ రహదారిపై పోలీసు వాహనాలను అడ్డుగా పెట్టి బైక్లను ఆపి, తాళాలను లాక్కొని పక్కనే ఉన్న చెట్లలో పడేశారు. పోలీసుల చర్యల వెనుక మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదేశాలు వున్నాయని సోమిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళెం గ్రామంలో వైసీపీకి చెందిన యువనేత యనమల రాజేంద్ర టీడీపీలో చేరేందుకు బుధవారం ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఉదయం తన మద్దతుదారులతో కలిసి వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయానికి రావడానికి రెడీ అయ్యారు. దీంతో సీఐ గంగాధర్, ఎస్ఐ అయ్యప్పలు గొలగమూడి వద్ద జాతీయ రహదారికి అడ్డంగా తమ వాహనాలను ఉంచి వారిని అడ్డుకున్నారు. యువకుల బైక్ల తాళాలను లాక్కొని పక్కనే ఉన్న చెట్లలో పడేశారు. పోలీసులకు యువతకు మధ్య కాసేపు వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అక్కడకు చేరుకుని పోలీసులతో వాదనకు దిగారు.
అయినప్పటికీ బైక్లను వదిలిపెట్టకపోవడంతో పోలీసుల తీరుకు నిరసనగా సర్వేపల్లి క్రాస్ రోడ్డు నుంచి టీడీపీ కార్యాలయం వరకు యువతతో కలిసి సోమిరెడ్డి పాదయాత్ర చేశారు. తమను లాఠీలతో కొట్టారని యువకులు చెప్పడంతో సోమిరెడ్డి మళ్లీ సర్వేపల్లి క్రాస్రోడ్డు వద్దకు వెళ్లి సీఐని దీనిపై ప్రశ్నించారు. చివరకు వెంకటాచలంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని యనమల రాజేంద్ర తన సన్నిహితులతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది.
Read Also: CM KCR: నేడే మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ టూర్.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!