Nandigam Suresh: సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ…. 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు. సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారని.. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలను దోచుకున్నారని ఎంపీ ఆరోపించారు. టీడీపీలో అణగారిన కులాలపై, అణగారిన కుటుంబాలపై దాడులు జరిగేవి…. జగన్ పాలనలో వాటికి అడ్డుకట్ట వేశారని తెలిపారు.
Read Also: Diwali Holidays: బ్యాంకులకు దీపావళి సెలువులు ఎన్ని రోజులో తెలుసా..!
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ… జగన్ పాలనలో రాజకీయంగా అణగారిన కుటుంబాలను ఆదుకున్నారన్నారు. గ్రామస్థాయి నుండి రాజ్యసభ స్థాయి వరకు బీసీ ఎస్సీలకు పెద్దపీట వేశారని ఎంపీ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, తన పాలన రూపంలో కొనసాగిస్తున్న జగన్ ను మళ్ళీ సీఎం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో పెదకూరపాడు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ అడ్డాగా మారాలని మోపిదేవి పేర్కొ్న్నారు.
Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..
సీఎం జగన్ నాయకత్వంలో పెదకూరపాడు అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ నాయకులకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే నాయకుడు సీఎం జగన్ అని… సాధికార యాత్ర ఫలితాలు రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..